- ఆరోగ్యంపై అందరూ శ్రధ్ధ వహించాలి
- డీఎస్సార్ క్లీనిక్ ప్రారంభోత్సవంలో హీరో సుమన్
విశాఖపట్నం,
ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం చాలా ఖరీదయిపోయింది. పేద, మధ్యతరగతి కుటుంబాలు భరించలేని స్థాయికి చేరింది. అందుకే ఆరోగ్యంపై అందరూ శ్రద్ధ తీసుకోవాలి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కచ్చితం వ్యాయమం చేయాలి. ఆరోగ్య సూత్రాలను పాటించాలని సినీ హీరో సుమన్ అన్నారు. ఏదైనా సమస్య వచ్చినపుడు మాత్రమే డాక్టర్ వద్దకు వెళ్లడం సరికాదు. ప్రతీ మూడు నెలలకు ఓసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం ప్రస్తుతం చాలా అవసరమని సూచించారు. విశాఖలోని కేజీహెచ్ డౌన్ లో డాక్టర్ సుకుమార్ సారథ్యంలో ఏర్పాటు చేసిన క్లీనిక్ ను సుమన్ ప్రారంభించారు. కరోనా తర్వాత ప్రతీ ఒక్కరిలోనూ ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డాక్టర్ సుకుమార్ వంటి సుప్రసిద్ధ వైద్యులు సామాజిక సేవలో భాగంగా తక్కువ ధరలకే మెరుగైన వైద్యం అందించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నానని, తర్వలో మరిన్ని అత్యాధునిక వసతులతో ల్యాబ్ ను అందుబాటులో తీసుకువస్తామని సుకుమార్ తెలిపారు.