అంగుళం భూమి కోసం అన్నదమ్ముల మధ్యే గొడవలు తలెత్తుతున్న ఈ రోజుల్లో.. కర్ణాటకలో ఓ వ్యక్తి చేసిన సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. గోవు రుణం తీర్చుకోవడం కోసం గోశాల నిర్మాణానికి ఏకాంగా నాలుగున్నర ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు ఓ ముస్లిం. దీంతో అందరు అతడి దాతృత్వాన్ని కీర్తిస్తున్నారు. అదే స్థలంలో ఆంజనేయ స్వామి మందిరం నిర్మించాలనే కోరిక కూడా తనకు ఉందని అన్నాడు ఆ వ్యక్తి.
మహ్మద్ నజీర్.. కాఫీ గింజల వ్యాపారం చేస్తున్నాడు. తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిని గోశాల నిర్మాణం కోసం దానం చేశాడు. గోశాలతో పాటు అందులో అనాథ శరణాలయం, వృద్ధాశ్రమం, పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం కట్టనున్నారు. కాడూరు-మంగళూరు జాతీయ రహదారి-173 పక్కనున్న ఆ భూమి విలువ దాదాపు రూ.2 కోట్లు వరకు ఉంటుంది. ఈ భూమిని చిక్కమగళూరుకు చెందిన స్వామి సమర్థ్ రామదాస ట్రస్ట్కు దానంగా ఇచ్చాడు.
‘నా తల్లికి క్యాన్సర్ ఉంది. అమెకు ఓసారి గోమూత్రం తాగించాను. దీంతో క్యాన్సర్ వ్యాధి నయమైంది. అయితే ఆ గోమాత రుణం ఎలాగైన తీర్చుకోవాలనుకున్నాను. వాటికి ఎంతో కొంత సహాయం చేయాలని నా నాలుగున్నర ఎకరాల భూమిని గోశాల నిర్మాణం కోసం ఇచ్చాను. వాటి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అని నజీర్ తెలిపాడు.