” రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో నత్తనడకన సాగుతోందంటూ వస్తున్న ప్రచారం తప్పని తేలిపోయింది. మూడు నెలల కాలంలో అక్కడ జరిగిన ఇళ్ల అమ్మకాలు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.”
ఇండ్ల అమ్మకాల్లో హైదరాబాద్ హవా కొనసాగుతున్నది. ఈ ఏడాది తొలి త్రైమాసికానికి (జనవరి-మార్చి)గాను దేశంలోని 8 ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రముఖ రెసిడెన్షియల్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్టైగర్.కామ్ తెలిపింది. గత ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్లో 6,560 యూనిట్ల విక్రయాలు జరుగగా.. ఈ ఏడాది ఇదే వ్యవధిలో 10,200 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో 55 శాతం వృద్ధి నమోదైంది. ఈ స్థాయిలో దేశంలో మరెక్కడా ఈసారి పెరుగలేదని ‘రియల్ ఇన్సైట్ రెసిడెన్షియల్-జనవరి-మార్చి 2023’ పేరుతో విడుదల చేసిన తమ తాజా నివేదికలో ప్రాప్టైగర్.కామ్ తెలియజేసింది.
హైదరాబాద్తోపాటు ముంబై, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ల్లో ఇండ్ల అమ్మకాలు, కొత్త నిర్మాణాల ప్రారంభంపై ప్రాప్టైగర్.కామ్ ఈ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో ఈ 8 నగరాల్లో 85,850 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. నిరుడు ఇదే త్రైమాసికంలో 70,630 యూనిట్లుగానే ఉన్నాయి. అలాగే కొత్త నిర్మాణాల ప్రారంభం కూడా 86 శాతం ఎగిసి 79,530 యూనిట్ల నుంచి 1,47,780 యూనిట్లకు పెరిగింది. ఇదిలావుంటే ఢిల్లీ-ఎన్సీఆర్, కోల్కతా, బెంగళూరుల్లో ఈసారి అమ్మకాలు పడిపోయాయని తేలింది.