విశాఖపట్నంలో నిర్వహించిన విజన్ విశాఖ సదస్సులో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈసారి ఎన్నికల్లో కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు. అంతేకాదు ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని గుర్తుచేశారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయాం.. అందుకే రాష్ట్రానికి విశాఖ వంటి పెద్ద నగరం అవసరం అని జగన్ స్పష్టం చేశారు.
అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళుతోంది..హైదరాబాద్ కంటే విశాఖలో అభివృద్ధి అధికంగా జరుగుతోంది.. బెంగళూరు కన్నా విశాఖలోనే మెరుగైన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని మీడియా సంస్థలు స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.