”తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ ఆధ్వర్యంలో అధికార బీఆర్ఎస్ ..కాంగ్రెస్ ధాటికి నిలబడే పరిస్థితి కనిపించడంలేదు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ 62 స్థానాలతో అధికారం కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయ్. 119 సీట్లున్న తెలంగాణ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరుగుతుందని కొన్నాళ్ల క్రితం భావించినా.. బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో ఆ పార్టీ పోటీలో లేకుండా దిగజారిపోయింది. బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతోనే ఇలా జరిగిందని భావించిన తెలంగాణలో మెజార్టీ ఓటర్లు.. కాంగ్రెస్ కి మొగ్గు చూపారు. 20-25 స్థానాలకే పరిమితమవుతుందనుకున్న కాంగ్రెస్ అనూహ్యంగా దూసుకొచ్చింది. రేవంత్ రెడ్డి నాయకత్వ్యంలో విశ్లేషకులు ఊహకు అందని రీతిలో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ పెరిగింది. 20 శాతం నుంచి.. 38 శాతానికి పెరిగి… తర్వాత వారం వ్యవధిలోనే అనూహ్యంగా విజయం దిశగా దూసుకొచ్చింది. సీట్లు మాత్రం..62 నుంచి 65 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడవచ్చు. బీజేపీ 6 , ఎంఐఎం 6,సీట్లలో గెలిపొందవచ్చు బీఆర్ఎస్ 36-38 సీట్లకే పరిమితం కావచ్చు..”
ముఖ్య0గా అర్బన్ ప్రాంతాలలో పోలింగ్ శాతం తగ్గడమే అధికార బీఆర్ఎస్ ఆ స్థానాలైన దక్కించుకునేందుకు కారణం కావచ్చు. ప్రభుత్వ వ్యతిరేఖ ఓటర్లలో మెజార్టీ ఓటర్లు పోలింగ్ కి దూరంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆంధ్రా ప్రాంతానికి చెంది… తెలంగాణలో ఓట్లు ఉన్న వారిలో ఎక్కువ మంది ఓటు వేయలేదని తెలుస్తోంది. ఈ ఒక్క కారణం కాంగ్రెస్ కి అనుకున్నన్నీ (72) స్థానాలు రాకపోవడానికి కారణం కావచ్చు.
”పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన 8 అసెంబ్లీ స్థానాలలో రెండు చోట్ల మినహా మిగిలిన స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులకు 2 శాతం లోపు ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే డిపాజిట్లు కోల్పోనున్నారు..”
”అభి న్యూస్” అంచనా ప్రకారం.. పార్టీల వారీగా గెలుపొందే అసెంబ్లీ సీట్లు..
- బీఆర్ఎస్ 36-38
- కాంగ్రెస్ 62-65
- బీజేపీ 5-6
- ఎంఐఎం 6-7
- ఇతరులు 2-3
ఎగ్జిట్ పోల్స్ 90 శాతానికి పైగా సంస్థలు కాంగ్రెస్ అధికారం చేపడుతుందని చెప్పినా.. అభి న్యూస్ మాత్రం.. 70 స్థానాలు కాంగ్రెస్ఇం కి రావని.. అయినా అధికారంలోకి వస్తుందని తేల్చి చెపుతోంది.