- జకార్తా, ఢాకా, లాగోస్ నగరాలకు ముప్పు ఎక్కువ
- బ్రిటిష్ కొలంబియా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి
రాకెట్లను ఆకాశంలోకి పంపిస్తుండటం ద్వారా సమాచార వ్యవస్థను బలోపేతం చేయడం తెలిసిందే. అయితే ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం రాకెట్ భాగాలు విడిపోయి వ్యర్థాలుగా మారుతాయి. ఇలా వ్యర్థాలుగా మారిన రాకెట్ విడిభాగాలు భూ దిగువ కక్ష్యలో వేలాదిగా పరిభ్రమిస్తున్నాయి. వాటిని అయస్కాంత శక్తి సాయంతో మళ్లీ భూమి మీద ఉన్న సముద్రాల్లో పడేయకపోవడం వల్ల ఆ భారీ శకలాలు భూమి మీదకు తిరిగి ఎప్పుడు విరుచుకుపడుతాయోనన్న ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా.. భూకక్ష్యలో ఉన్న రాకెట్ శకలాలు వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నదని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా పరిశోధకులు హెచ్చరించారు. శకలాలు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు: జకార్తా, ఢాకా, లాగోస్శకలాలు పడే ప్రమాదం తక్కువగా ఉన్న ప్రాంతాలు: న్యూయార్క్, బీజింగ్, మాస్కో
ఆ వ్యర్థాలను వెంటనే అయస్కాంత శక్తులతో సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చని అన్నారు. ఒకవేళ, ఆ శకలాలు ప్రయాణిస్తున్న విమానం లేదా పాఠశాల భవనంపై పడితే ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ వివరాలు ‘నేచర్ ఆస్ట్రానమీ’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.