విభజన హామీలపై పోరాడాలని సూచన
అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలి
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబులకు బహిరంగ లేఖ రాశారు. ఏపీ విభజన హామీల అమలపై కేంద్రం ప్రభుత్వం 10 ఏళ్లుగా అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని, విభజన హామీలను గుర్తు చేస్తూ పోరాటం సాగించాలని, హామీలపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని లేఖలో ఆమె సూచించారు. తమ డిమాండ్లను మీ ముందుంచామని, మీమీ పార్టీల తరఫున అసెంబ్లీలో చర్చించాలని లేఖలో డిమాండ్ చేసారు.