తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పలు హామీలు ఇచ్చారు. ”భవిష్యత్తుకు గ్యారంటీ..” పేరుతొ TDP ఇచ్చిన హామీలతో ఆ పార్టీ కేడర్ జోష్ నెలకొంది. జగన్ సర్కార్ ఎన్ని ఉచితాలు ఇస్తున్నా.. చంద్రబాబు వస్తే ఏమేమి ఇస్తాడు.. అనేదే నేడు జనంలో ఉన్న ఆబ. ఇతను ఇచ్చాడు.. అతను ఇస్తానంటున్నాడు ఈసారికి చంద్రబాబుకి ఛాన్స్ ఇద్దాం.. అంటూ జనంలో టీడీపీ వేవ్ మొదలైనట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2024లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే లక్ష్యంతో భవిష్యత్ కు గ్యారంటీ పేరుతో మినీ మేనిఫెస్టోని చంద్రబాబు ప్రకటించారు. వైఎస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు టీడీపీ పెద్దపీట వేసింది. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు. 3 సిలిండర్లు ఫ్రీ, మహిళలకు జిల్లాల పరిధిలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ప్రకటించారు. నిరుద్యోగులకు రూ.3 వేలు నిరుద్యోగభృతి అందిస్తామని చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు.
మినీ మేనిఫెస్టోను ప్రకటించిన చంద్రబాబు
1) పేదలను ధనవంతులు చేయడం
1.పేదలను సంపన్నులను చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
మినీ మ్యానిఫెస్ట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు పూర్ టూ రిచ్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకంతో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
2) బీసీలకు రక్షణ చట్టం
బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తుంది తెలుగుదేశం పార్టీ. వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని టీడీపీ బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తోంది. వారికి అన్ని విధాలా అండగా నిలిచేలా ఈ చట్టాన్ని తీసుకుని వస్తోంది.
3) ఇంటింటికీ నీరు
టీడీపీ అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు చంద్రబాబు. ఈ హామీ ముక్యంగా రాయలసీమ ప్రాంతంలో రాజకీయంగా పెను మార్పు నకు ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
4) రైతన్నకు
అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం. రాష్ట్రంలో అన్నదాత పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందించి వారికి చేయూతగా ఉండాలని తెలుగుదేశం నిర్ణయించింది.
5) మహిళ ‘మహా’ శక్తి
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకుని వస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళ ‘మహా’ శక్తి పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు చంద్రబాబు.
6) యువగళం
1. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం
2. ప్రతి నిరుద్యోగికి ‘యువగళం నిధి’ కింద నెలకు 3000 రూపాయలను ఇస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం