” ముఖ్యమంత్రి జగనన్న బీజేపీకి ఎందుకు ఊడిగం చేస్తున్నారు. బీజేపీ ఏపీకి ఏమీ చేయకపోయినా.. జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు.
బీజేపీ ఒక మత తత్వ పార్టీ కాబట్టే రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని ప్రతిసారి వ్యతిరేకించారు. ఒక మతాన్ని రెచ్చగొట్టడం, ఇంకో మతాన్ని అవమానించడం. వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాడ0, చలి కాచుకోవడాం.. అలాంటి బీజేపీ పార్టీకి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగనన్న గారు ఇంతగా అమ్ముడు పోతారని ఎవరూ ఏ రోజు అనుకోలేదు..” అని షర్మిల సీఎం జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.
వైసీపీ చీఫ్ ట్రిక్స్ తో పెరుగుతున్న షర్మిల గ్రాఫ్: షర్మిల రెడ్డి కాదు.. షర్మిల శాస్త్రి.. అనో, షర్మిల వ్యక్తిగతంగా నైతికత లేని మహిళ అని .. ఇలా షర్మిలపై వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలం అవుతుందనుకుని వారు రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలపై చేస్తున్న తప్పుడు ప్రచారానికి.. ఈమెకే జనంలో మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ముక్యంగా క్రిస్టియన్ సమాజంలో షర్మిలకు మంచి సపోర్ట్ లభిస్తున్నట్లు అంచనాలు వస్తున్నాయ్. ” జగన్ పైనా, వైసీపీ పార్టీ పైనా షర్మిల రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ కూడా ఇందుకు ప్రతిగా రాజకీయ విమర్శలు చేస్తే సరిపోయేది. ఆమె తెలంగాణలో చతికిలబడి ఆంధ్రాకి వచ్చి ఏం చేయగలదు .. వంటి విమర్శలు చేస్తే జనంలో కాస్త ఆలోచన వచ్చేది…కానీ మా వాళ్ళు చేస్తున్న పనికి మాకే ఎక్కువ నష్టం వచ్చేలా కనిపిస్తోంది..’ అని ఓ వైసీపీ నాయకుడు ఆందోళన వ్యక్తం చేసారు. షర్మిల ప్రసంగాలతో పోలిస్తే.. జగన్ ప్రసంగాలు పేలవంగా సాగుతున్నాయి. ఇది కూడా వైసీపీకి మైనస్సే అవుతుంది.
టీడీపీనీ వదలట్లేదు: షర్మిల వైసీపీ, జగన్ నే కాదు.. టీడీపీపైనా, చంద్రబాబుపై కూడా రాజకీయంగా విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబుపై కాస్త ఘాటు తక్కువగానే ఉంటుంది. అధికార పక్షాన్నీ విమర్శించడానికి అనేక0 దొరుకుతాయి..
మధ్య నిషేధం.. మణిపూర్ ఇష్యు హైలెట్స్: వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్య నిషేధం అమలు చేస్తానని జగనన్న హామీ ఇచ్చి ప్రజలను మోసగించారంటూ షర్మిల ఉత్తరాంధ్ర సభలలో చేసిన ప్రసంగాలు జనంలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. అలాగే మణిపూర్ లో 2 వేల చర్చ్ లు కూలగొట్టిన బీజేపీకి .. ఒక క్రెస్తవుడై ఉంది జగన్ ఎలా సపోర్ట్ చేస్తాడంటూ షర్మిల నిలదీస్తున్నారు. దీనికి వైసీపీకి సమాధానం చెప్పే దమ్ము లేకపోయే. అలాగే పోలవరం., ప్రత్యేక హోదా.., పారిశ్రామిక అభివృద్ధిపై షర్మిల అడుగుతున్న ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పలేక.. వ్యక్తిగతంగా షర్మిలపై విరుచుకుపడేందుకు సోషల్ మీడియాను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. అయితే జగనన్న బాణం.. షర్మిల రివర్స్ అయినట్లుగానే.. వైసీపీ వాళ్ళు చేస్తున్న చిల్లర వ్యవహారాలు కూడా రివర్స్ అయ్యేలా కనిపిస్తున్నాయ్.