దేశంలో కియా కారు ఎక్కడ కనిపించినా అనంతపురం జిల్లానే గుర్తుకు వస్తుంది.. కరువు జిల్లాకు కార్లు పండే కియాను తీసుకొచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని నారా లోకేశ్ పేర్కొన్నారు. ఉపాధి లేక వలసపోతున్న యువత కోసం కియా కంపెనీ తీసుకొచ్చి 50 వేల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాను హార్టికల్చర్ హబ్ గా మార్చి, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సదుపాయం కల్పించి అనంతను అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని వివరించారు.
మన బిల్డప్ బాబాయి జగన్ మాత్రం సిద్ధం సభలో డ్రోన్ ను చూసి భయపడ్డాడని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. సభకు రారనే విషయం ముందే తెలుసు కాబట్టి గ్రాఫిక్స్ కు వీలుగా గ్రీన్ మ్యాట్ వేశారని ఆరోపించారు. తనను బండబూతులు తిట్టిన అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ ను సూటిగా అడుగుతున్నా.. డ్రోన్ ను చూసి పిల్లుల్లా ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బాహుబలి చూపిస్తానని చెప్పి పులకేశి సినిమా చూపించారని అన్నారు.