బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును మరో కీలక పదవి వరించింది. రాజ్యసభలో బీజేపీ విప్గా ఆయన నియమితులయ్యారు. ఆ పార్టీ అధిష్ఠానం నిన్న నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు పార్టీ నేతలకు విప్ పదవులను కేటాయిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు నరసింహారావును బీజేపీ విప్గా ఆ పార్టీ నియమించింది. ఈ హోదాలో జీవీఎల్… ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేసే బాధ్యతలను చేపట్టనున్నారు.