‘సాక్షాత్తు మంత్రి నివాసాన్ని పెట్రోల్ పోసి తగలబడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర ఎందుకు పోషించారు? కోనసీమ జిల్లా సాధన కమిటీ ఆందోళన ప్రకటనను ఆసరాగా చేసుకుని సంఘ వ్యతిరేఖ శక్తులు చొరబడి విద్వాంసం సృష్టించడాన్ని ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టినా అధికార పార్టీ పెద్దల ఒత్తిడితో చోద్యం చూసారా?” ఇలాంటి అనుమానాలెన్నో కోనసీమ అల్లర్ల వెనుక దాగి ఉన్నాయి.
అమలాపురంలో జరిగిప భారీ విధ్వంసానికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే ప్రధాన కారణమని అన్ని వర్గాల నుంచీ వినిపిస్తున్న మాట. ఆందోళన తీవ్రరూపం దాల్చి సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే నివాసాలకే నిప్పు పెట్టడం, వాటిలో ప్రాణభయంతో ఉన్నవారిని అక్కడి నుంచి తరలించాల్సిన పరిస్థితులు తలెత్త టం, ఏకంగా జిల్లా ఎస్పీపైనే రాళ్ల దాడి, ఆయన్ను మిగతావారు కాపాడాల్సి రావడం వంటి ఘటనలు.. ఇటీవల దశాబ్దాల కాలంలో రాష్ట్రంలో జరిగిన దాఖలాలూ లేవు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పేందుకు మంగళవారం నాటి ఘటనలే ఉదాహరణ.
కోనసీమలో జూన్ 30 వరకూ సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉంటాయని.. ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని ప్రకటించారు. అయితే ఆ దిశగా తగిన కార్యాచరణ అమలు చేయటంలో విఫలమయ్యారు. కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం తలపెట్టిన కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం తరలివస్తారనే విషయాన్ని ముందుగా అంచనా వేయలేకపోయారు.
వందల్లోనే వస్తారని భావించి… వారిని నియంత్రించేందుకు వీలుగా పోలీసు పికెట్లు, సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వేల మంది యువకులు పోటెత్తటంతో వారిని అదుపు చేయటం పోలీసుల వల్ల కాలేదు.
ఇంటిలిజెన్స్ ఫెయిల్యూర్ !
కుల సమీకరణాల పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన కోనసీమలో చిన్న వివాదం కూడా ఘర్షణలకు దారితీసిన అనుభవాలు గతంలో ఉన్నాయి. అలాంటిచోట జిల్లా పేరు మార్పుపై అభ్యంతరం తెలుపుతూ గత నాలుగైదు రోజులుగా భారీ నిరసనలు చేపడుతూనే ఉన్నారు. అవి తీవ్రరూపం దాల్చక ముందే పరిస్థితి అంచనా వేసి జాగ్రత్తపడాల్సిన , ముందుగానే హెచ్చరికలు జారీ చేయాల్సిన ఇంటిలిజెన్స్ ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది.
నిరసనలు తెలుపుతున్న వారి అభ్యంతరాలేంటో చర్చల ద్వారా తెలుసుకోలేకపోయారు. సాక్షాత్తూ.. మంత్రి ఇంటికే ఒక ఎమ్మెల్యే ఇంటికే నిప్పు పెట్టే పరిస్థితి ఉంటే.. సామాన్యులకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందా? అనేది ఇప్పుడు మేధావులు అడుగుతున్న మాట.
పీకే వ్యూహంలో భాగమా?
ఇదిలా ఉంటే కోనసీమ అల్లర్ల వెనుక వైసీపీ రాజకేయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ తెరవెనుక అల్లర్లకు కారణమా? అనే కోణంలోనూ పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లర్లకు ముందు రోజు స్థానికంగా ఒక అపార్ట్మెంట్ లోకి, ఒక లార్డ్జ్ లోకి దిగిన వ్యక్తుల ఆచూకీ కోసం సి.సి. కెమెరాలను ఎందుకు పరిశీలించడంలేదన్న అనుమానాలు వస్తున్నాయ్.