ఏపీ మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో సీఎం జగన్ పాత్ర ఉందంటూ టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే కేసు దర్యాఫ్తునకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న అవినీతికి అంతేలేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అధికార యంత్రాంగంతో రాజకీయ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాజమండ్రి కేంద్రంగా ఇసుక దందా చేస్తున్నారని, దాని ద్వారా రోజుకు రెండు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు.