”కేంద్రంలో బీజేపీ అధికారం ఖాయం. వచ్చే ఎన్నికలలో ఏపీలో మనం గెలిచిన తర్వాత అయినా మోదీ సహకారం లేకపోతే రాష్టాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము. జగన్ చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతుంది.” ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన.
జనసేన-టీడీపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో భేటీ సందర్బంగా చంద్రబాబు తన మనసులో మాట బయట పెట్టారట. బీజేపీ పొత్తు వ్యవహారంపై టీడీపీ కేడర్ మాత్రం సుముఖత చూపడంలేదు. అయితే మిత్రపక్ష నేత పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ పొత్తు ఉంటేనే బాగుంటుందని చంద్రబాబుతో అన్నట్లు చెపుతున్నారు.
175 అసెంబ్లీ సీట్లలో.. జనసేనకు 28 నుంచి 30 స్థానాలు కేటాయించినట్లు తెలుస్తోంది. 2 లోక్ సభ సీట్లు కూడా ఖరారయ్యాయి. అయితే బీజేపీతో పొత్తుతో వెళ్లే పక్షంలో ఆ పార్టీకి 12 నుంచి 15 అసెంబ్లీ, 6-8 పార్లమెంట్ స్థానాలతో మిత్రత్వంతో వెళ్లాలన్నది టీడీపీ అధినేత యోచనగా ఉంది.
సమదూరంలో బీజేపీ: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ-జనసేన పార్టీలతో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ అగ్రనేతలతో ఇంట్రెస్ట్ కనిపించడంలేదు. అయితే రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మరికొందరు నేతలు టీడీపీ-జనసేన్తో పొత్తుతో ఎన్నికలకు వెళితే పరువు పోకుండా ఉంటుందని చెపుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ బీజేపీకి అస్సలు ప్రేయారిటీ కాదు. అయితే ఏపీలో టీడీపీ వేవ్ బాగుందన్న కారణంగా ఆ పార్టీకి 15-20 పార్లమెంట్ స్థానాలు వస్తాయోమోనన్న అంచనాలతో ఉన్న బీజేపీ నేతలు పొత్తుపై ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది.