కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వచ్చే ఎన్నికలలో కాకినాడ సిటీ అసెంబ్లీ నుంచి పోటీకి దిగడానికి సై అంటున్నారా? అవుననే అంటున్నారు జనసేన కీలక నేతలు..
1978 జనతా పార్టీ నుంచి రాజకీయ ప్రస్తావన ప్రారంభించిన ముద్రగడ.. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలలోనూ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవులు దక్కించుకున్నారు. రాజకీయాలలో నిజాయితీ పరుడిగా పేరు సంపాదించిన ముద్రగడ.. అంతే రీతిలో ఉన్న పార్టీకి నిబద్దతతో వ్యవహరిస్తారని పేరుండేది.
జనసేన నుంచి పోటీకి సై : ఇటీవల వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న ముద్రగడ .. త్వరలో అదే పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ”పవన్ కళ్యాణ్ తనపై పోటీచేయాలి…” అని కొన్ని రోజుల క్రితం ఛాలెంజ్ చేసిన ముద్రగడ.. పవన్ ఎక్కడ పోటీ చేస్తే.. తానూ పవన్కి వ్యతిరేఖంగా పోటీ చేస్తానని ప్రతిన బూనారు ముద్రగడ. అయితే ఇపుడు పవన్ పార్టీలో చేరాల్సిన పరిస్థితి తటస్తించింది ముద్రగడకు. కాపు ఉద్యమ సమయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబం సహాయం అందించింది.. అంటూ చెప్పిన ముద్రగడ.. ఇపుడు అదే ద్వారంపూడిపై పోటీకి తహతహలాడుతున్నట్లు తెలుస్తోంది.
కాపులలో జోష్.. ముద్రగడ ..జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు కావడంతో జన సైనికులు, కాపు నేతలలో ఉత్సాహం నెలకొంది. ”పవన్ కళ్యాణ్ ని పలుమార్లు అవమానపరిచిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ముద్రగడ పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమ్.. ఇది జన సైనికులకు పండగలాంటిది..”అని పలువురు జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జనసేనలో ముద్రగడ చేరిక: ఇప్పటికే జనసేన నాయకులతో చర్చలు జరిపిన ముద్రగడ పద్మనాభం పార్టీలో చేరికకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జనవరి నెలాఖరుకి చేరిక తేదీ నిర్ణయం జరిగే ఛాన్స్ ఉన్నట్లు జనసేన .కీలక నేత ఒకరు చెప్పారు.