ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో టీడీపీ-జనసేన జండా ఎగరబోతోంది.. అంటూ జాతీయ స్థాయిలో ప్రముఖ మీడియా సంస్థ ”ఇండియా టుడే” సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల అంచనాలపై ఇండియా టుడే, సి-ఓటర్ సంస్థతో కలసి సర్వే నిర్వహించింది. ఈ ఫలితాలను బుధవారం వెల్లడిచేసింది.
ఈ సర్వే ప్రకారం.. ఏపీలో టీడీపీ-జనసేన కూటమికి 17 లోక్ సభ సీట్లు, వైసీపీకి 8 స్థానాలు దక్కుతాయని తెలిపింది. టీడీపీ-సేన మిత్రపక్ష కూటమికి ..45 శాత ఓట్లు , వైసీపీ 41%, కాంగ్రెస్ పార్టీ 2.7% , బీజేపీకి 2% వస్తాయని సర్వే స్పష్టం చేసింది.
శాసనసభలోను కూటమి హవా: అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈ సర్వే ప్రకారం టీడీపీ-జనసేన కూటమి విజయం స్పష్టం అవుతోంది. ఈ సర్వే తర్వాత కూటమి బలం మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు సదరు సంస్థ పేర్కొంది. 2019 ఎన్నికలలో ఏపీలో 50 శాతం ఓట్లు వైసీపీకి, 39 శాతం ఓట్లు టీడీపీకి, 6 శాతం వరకు జనసేనకు వచ్చాయి. 2024 ఎన్నికలలో ఈ ఫలితాలు తారుమారుకానున్నాయ్.