”ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం దోపిడీపై ధ్వజమెత్తాలి.. కేసులు పెట్టండి.. ” అంటూ ప్రధాని మోదీ కొద్దీ రోజుల క్రితం విశాఖపట్నం లో ఏపీ బీజేపీ నేతలకు సూచించారు. అయితే ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు , ఇతర నేతలు మోదీ ఆదేశాలను ఖాతరు చేయలేదు. దీంతో బీజేపీ అధిష్టానం మోడీ ఆదేశాలను సీరియస్ గా తీసుకుని కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిని పట్టించుకోకుండా.. నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తూ.. బీజేపీ అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, పార్టీ సీనియర్ నేతలు సత్య కుమార్, మాధవ్ లతో ఈ కమిటీ ఏర్పాటు చేసారు. వైసీపీ భూ అక్రమాలు, మైనింగ్, పోర్టుల అక్రమాలు, దందాలు తదితరాలపై ఆయా పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదు చేయాలనీ కమిటీకి నిర్దేశం చేసారు. మే నెల 5 వ తేదీ నుంచి కమిటీ రంగంలోకి దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
అయితే వైసీపీ అధిక్రమలోకి వచ్చినప్పటి నుంచీ ఏపీ బీజేపీ లాలూచి పడినట్లు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాకు అయితే డైరెక్ట్ గా జగన్ నుంచి భారీ ప్యాకేజీ తీసుకుని ప్రతిపక్ష టీడీపీని తీవ్రంగా విమర్శింస్తూ ఉన్నారు. ఇవన్నీ పరిశీలించిన బీజేపీ అగ్ర నాయకత్వం సోమును పక్కనపెట్టి నలుగురితో ఏర్పాటు చేసిన కమిటీ జగన్ అక్రమాలను ఎంతవరకు బయటపెడతారో వేచి చూడాలి.