టమాటా.. చాలా రాష్ట్రాలలో రెగ్యులర్ కూరగాయ. కూరలు, సలాడ్లు, సూప్ లలో విరివిగా వాడుకునే టమాటా కు ధరల భారీ వ్యత్యాసం ఎందుకు? ముఖ్య0గా ఏపీలో చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలతోపాటు, తెలంగాణలోనూ పలు చోట్ల టమాట సాగు ఎక్కువగా జరుగుతుంది. అయితే దిగుబడి ఒక్కసారిగా భారీగా రావడమే ధర పతనానికి కారణం. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులదే.
చిత్తూరు జిల్లా మదనపల్లి, ములకలచెరువు, పెదతిప్ప సముద్రం ప్రాంతాలలో టమాట సాగుతో కోటేశ్వరులైన రైతులు గాధలు అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా వేసవిలో కాపు వచ్చేలా టమాట నాటతారు. ఉష్టోగ్రతలు తక్కువగా ఉండటమే ఈ ప్రాంతంలో సమ్మర్ లోను టమాట దిగుబడి ఆశాజనకంగా ఉండడానికి కారణంగా చెప్పవచ్చు.
ఆగష్టు లో దిగుబడి రాకుండా చూసుకోవాలి..
టమాటా రేటు పూర్తిగా పడిపోయింది. రైతుకు కనీసం ఉత్పత్తి ఖర్చు కూడా రావడం లేదు. రవాణా ఖార్చు కూడా దండగ అని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో టమాటా ఐదు రూపాయలకు కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. పంట ఖర్చుతో పాటు రవాణా ఖర్చులు కలుపుకుంటే తమకు నష్టమే వస్తుందని రైతులు వాపోతున్నారు. అందుకే మార్కెట్ కు తీసుకురావడంత వేస్ట్ అని భావించి రోడ్లపైనే వృధాగా పడి వేస్తున్నారు. కనీసం టమాటా పండించిన రైతులకు కూలీ ఖర్చు కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురంలో గిట్టుబాటు ధర లేదని క్లాక్ టవర్ సెంటర్ లో రైతులు ఆందోళనకుక దిగారు. రోడ్లపై టమాటాలను పోసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రైతులతో పాటు రైతు సంఘం నేతలను అరెస్ట్ చేశారు. కిలో రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రైవు భరోసా కేంద్రాల ద్వారా టమాటాను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఏటా ఇలాంటి పరిస్థితులు రెండు, మూడు సార్లు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని కంట్రోల్ చేయాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఏయే ప్రాంతాలలో ఏయే సమయాల్లో టమాట సాగు చేయాలనే దానిపై ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక ఇవ్వాలని రైతు నాయకులు సూచిస్తున్నారు.
రైతులు కూడా ఏటా ఏ సమయంలో ధర బాగా పతనమవుతుందన్న దానిపై దృష్టి పెట్టి.. ముక్యంగా ఆగస్టు నెలలో టమాటా దిగుబడి రాకుండా ప్లాన్ చేసుకోవాలి. ఏప్రిల్, మే నెలల్లో కిలో రైతుకే వంద రూపాయల వరకు ధర పలికింది. అలా ఏ సమయాల్లో ధర బాగుందో దాన్ని బట్టి వాతావరణ పరిస్థితిని అంచనా వేసుకుని సాగు చేసుకోవాలి.