Hyderabad To Arunachalam: తెలంగాణ టు అరుణాచలం

TElanga  To Arunachalam:అరుణాచలం.. దేశంలోనే  ప్రసిద్ధమైన శైవక్షేత్రం . ఇటీవల తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా అరుణాచలం వెళుతున్నారు .    తమిళులు   ఈ క్షేత్రాన్ని తిరువణ్ణామలైగా పిలుస్తారు .    ఒక్కసారి అరుణాచలేస్వరుడిని   దర్శించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు  చెబుతుంటాయి .

 హైదరాబాద్ నుంచి అరుణాచలానికి ఒక ప్రత్యేక టూర్​ ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం శాఖ .

హైదరాబాద్(Hyderabad) నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం సెప్టెంబర్​ 15వ తేదీ నుంచి  అందుబాటులో ఉంది. ఈ నెలలో టూర్​ మిస్​ అయితే మళ్లీ వచ్చే అక్టోబర్​లో టూర్​కి  మరో   అవకాశం కూడా ఉంది. ఇక 3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ టూర్​లో అరుణాచలేశ్వర ఆలయంతోపాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కూడా  కవర్ అవుతాయి.

  • మొదటి రోజు టూర్ హైదరాబాద్​లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది.
  • రెండో రోజు ఉదయం   6 గంటలకు కాణిపాకం చేరుకుంటారు. అక్కడ తయారై . .  ఉదయం 9 గంటల లోపు దర్శనం  చేసుకుంటారు. అక్కడి నుంచి బస్సు  తిరువణ్ణామలైకి బయల్దేరుతుంది .
  • మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం రీచ్​ అవుతారు. తర్వాత అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. నైట్​ అరుణాచలంలోనే బస చేస్తారు.
  • మూడవ రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్ చేసిన తర్వాత.. అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. తర్వాత శ్రీపురం గోల్డెన్ టెంపుల్​ను దర్శించుకుంటారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.
  • నాలుగవ రోజు ఉదయం హైదరాబాద్​కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ పూర్తవుతుంది.

టూర్ ప్యాకేజీ ధరల వివరాలు :

  • తెలంగాణ టూరిజం శాఖ ప్రకటించిన అరుణాచలం టూర్ ప్యాకేజీ ఏసీ బస్సు.   టికెట్ ధర పెద్దలకు రూ.8,000 పిల్లలకు రూ.6,400.