jagan; Highcourt: హైకోర్టులో జగన్‌కు ఊరట

పాస్ పోర్ట్ విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఊరట   లభించింది .  విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్ట్ విధించిన పాస్‌పోర్ట్ కాలపరిమితిని ఒక ఏడాది నుంచి 5 ఏళ్లకు పెంచింది.ఈ మేరకు హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. విజయవాడ కోర్టు ఆదేశించిన విధంగా ప్రజాప్రతినిధుల కోర్టుకు స్వయంగా వెళ్లి రూ. 20 వేల పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది.ట్రయల్ కోర్టు విధించిన మిగతా షరతులన్నీ యధావిధంగా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.