Liquor Scam Case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాకు బెయిల్ మంజూరు

Delhi Liquor Scam Case: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. ఈ మేరకు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

లిక్కర్ స్కాంలో నమోదైన సీబీఐ మరియు ఈడీ కేసుల్లో మనీశ్ సిసోడియాకు అత్యున్నత న్యాయస్థానం బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. కాగా జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఆగస్ట్ 6న తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సిసోడియా దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించింది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గత ఏడాది ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా.. అదే సంవత్సరం మార్చి 9వ తేదీన మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది.