Sabarmathi Express : పట్టాలు తప్పిన సబర్మతి ప్యాసింజర్ ఎక్స్‎ప్రెస్.. కాన్పూర్ లో ఘటన

ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని కాన్పూర్ రైల్వేస్టేషన్ (Kanpur Railway Station) సమీపంలో శనివారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్ పై బండరాయి పెట్టడంతో వారణాసి నుండి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ (Sabarmathi Express) పట్టాలు తప్పింది.

మొత్తం 22 బోగీలు పట్టాలు తప్పి ఒక వైపుకు ఒరిగిపోయాయి. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికుల (Passengers) కు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు (Officials) తెలిపారు. అదేవిధంగా ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు అధికారులు ప్రత్యమ్నాయంగా మరో రైలును ఏర్పాటు చేశారు.