Minister Achchennaidu: వైసీపీ నేతలపై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

Minister Achchennaidu: ఏపీలోని వైసీపీ నేతలపై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు ( Sensational Comments) చేశారు. సర్దార్ గౌతు లచ్చన్న (Gowthu Lachchanna) ను అవమానించిన వైసీపీ నాయకుల(YCP Leaders)కు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని విమర్శించారు.

గౌతు లచ్చన్న 115వ జయంతిని పురస్కరించుకుని మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achchennaidu) శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) లోని లచ్చన్న విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం బడుగు బలహీన వర్గాలకు లచ్చన్న చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. తమలాంటి నేతలకు లచ్చన్న ఆదర్శమన్న మంత్రి అచ్చెన్నాయుడు ఆయన ఆశయ సాధన కోసం కలిసి పని చేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే తోటపల్లి బ్యారేజీ (Thotapalli Barrage) కి తమ ప్రభుత్వం సర్దార్ గౌతు లచ్చన్న పేరు పెట్టిందని పేర్కొన్నారు. అయితే అటువంటి గొప్ప నేతను అధికార మదంతో వైసీపీ నేతలు అవమానించారని ఆరోపించారు. కానీ లచ్చన్నను అవమానించిన వైసీపీ నేతలకు గత ఎన్నిక (Previous Elections) ల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారని వెల్లడించారు.