Central Decision : ప్రధాని మోదీ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ లో ఇథనాల్ మిశ్రమం..!

Central Decision : కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం (Decision) తీసుకుంది. రానున్న రెండేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్ ( Petrol, Diesel) లో ఇథనాల్ (Ethanol)ను కలపాలని భావిస్తోందని సమాచారం. ఈ మేరకు పెట్రోల్ లో 20శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యంతో పని చేస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు డీజిల్ లో 5 శాతం ఇథనాల్ ను కలిపేందుకు గానూ కొత్త పథకాన్ని ( New Scheme) చేపట్టింది.

అంతేకాదు ఈ పథకంపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) సమావేశం కూడా నిర్వహించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇథనాల్ ను డీజిల్ తో కలపడం ఖర్చుతో కూడుకున్న పని. మైలేజీలో ఎటువంటి మార్పు ఉండకపోగా.. ఇది పర్యావరణానికి మంచిది. దాంతోపాటుగా ముడి చమురు దిగుమతుల (Crude oil imports) ను తగ్గించడంతో పాటు విదేశీ మాదకద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. ఈ కారణంగా గ్యాసోలిన్, డీజిల్ ధరలు తగ్గుతాయి.

ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (Automotive Research Association of India) 2018-19 వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తోంది. ఇథనాల్ మిశ్రమ ఇంధనంతో BS-III మరియు BS-VI వాహనాల్లో వాటి పనితీరు మరియు మన్నిక వంటి అంశాలను అంచనా వేసేందుకు ఈ టెస్టులు చేపట్టారు. సాధారణ డీజిల్ కంటే ఇంధన వినియోగం (Fuel consumption) స్వల్పంగా తక్కువగా ఉందని ఫైలట్ ప్రోగ్రామ్ గుర్తించినట్లు సమాచారం. మరోవైపు BS-VI వాహనాల్లో ఇథనాల్ కలిపిన డీజిల్ ను పరీక్షించలేదు. ఈ క్రమంలోనే చమురు ప్రభుత్వ రంగ సంస్థల తరపున భారీ వాహనాల్లో ఇంధనం పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. డీజిల్ తో ఇథనాల్ ను కలపే ప్రక్రియ ప్రయోగాత్మక దశలో ఉందని, త్వరలోనే దీన్ని ఉపయోగిస్తామని ప్రభుత్వ వర్గాలు (Government departments) వెల్లడించాయి. దీని ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.