Macharla Politics: మాచర్లలో టీడీపీ పట్టు.. మారుతున్న రాజకీయ సమీకరణాలు

Macharla Politics: పల్నాడు జిల్లా (Palnadu District) మాచర్లలో రాజకీయ సమీకరణాలు (Political Equations) శరవేగంగా మారుతున్నాయి. మాచర్ల మున్సిపాలిటీ (Macharla Municipality) లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ (Telugudesham Party) అక్కడ పట్టు బిగిస్తుంది.

మున్సిపాలిటీలో ఇప్పటికే 14 మంది వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు ( YSRCP Counciliors) టీడీపీ గూటికి చేరారు. తాజాగా మున్సిపల్ ఛైర్మన్ చిన్న ఏసోబు, వైస్ ఛైర్మన్ నరసింహారావు కూడా టీడీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి (MLA Julakanti Brahma Reddy) వారితో జరిపిన చర్చలు విజయవంతం కావడంతో టీడీపీ (TDP) లో చేరేందుకు సిద్ధమైయ్యారని సమాచారం. ఇప్పుడు మున్సిపాలిటీ ఛైర్మన్ (Chairman), వైస్ ఛైర్మన్ ( Vice Chairman) కూడా చేరితే టీడీపీకి మరింత బలం చేరనుంది. అయితే మాచర్లలో మొత్తం 31 వార్డులున్నాయన్న సంగతి తెలిసిందే. 2022 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో అన్ని వార్డుల్లో వైఎస్ఆర్ సీపీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మాచర్లలో రాజకీయాలు మారుతున్నాయి.