Earthquake: జమ్మూకాశ్మీర్ లో భూకంపం.. తీవ్రత 4.9 గా నమోదు.!

జమ్మూకాశ్మీర్ (Jammu and Kashmir) లో సంభవించిన రెండు భూకంపాలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఉదయం భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ ( National Center for Seismology) తెలిపింది. బారాముల్లా జిల్లా (Baramulla District) లో భూమి కంపించగా.. రిక్టర్ స్కేలు( Richter Scale) పై 4.9 తీవ్రత నమోదైంది. ఒక్కసారిగా భూకంపం (Earthquake) రావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే ప్రకంపనలు ఐదు కిలోమీటర్ల లోతులో 34.17 N అక్షాంశం, 74.16E రేఖాంశంలో సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ వెల్లడించింది. కొన్ని నిముషాల తరువాత అదే ప్రాంతంలో మరోసారి 4.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంపాల తీవ్రత ఉన్నప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని అధికారులు (Officials) తెలిపారు.