విశాఖలో రూ . 2.08 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శంఖస్థాపన . …
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ , , సృజనాత్మక రంగాలలో ఆంధ్రప్రదేశ్ కేంద్రబిందువు.. అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు . విశాఖపట్నం గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా రూపొందుతున్నారు.
విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోడీ శంఖుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని ఆంధ్రప్రదేశ్ కి తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ.. ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ తయారీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబడాలని మోడీ ఆకాంక్షించారు.
విశాఖపట్నం నగరంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ చిరకాల కోరిక ఈ రోజు నెరవేరబోతోందన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత వ్యవసాయ, వ్యాపార, పర్యాటక రంగాలకు, పారిశ్రామిక రంగాలకు ఈ జోన్ వల్ల కొత్త అవకాశాలు దక్కుతాయన్నారు. మౌలికసదుపాయాల మెరుగు వల్ల ప్రజల స్థితిగతులు మారతాయన్నారు.
విశాఖపట్నం, ఆంధ్రాలో ఉన్న తీరప్రాంతాలు వందల ఏళ్ల నుంచి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యాయని మోడీ తెలిపారు.
ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. చంద్రబాబు స్పీచ్తో సిక్సర్ కొట్టారని పేర్కొన్నారు.
”60 ఏళ్ల తర్వాత దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది” అని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్ అని, ఆయన నాయకత్వంలో రాబోయే రోజులలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి ఎదుగుతుందన్నారు చంద్రబాబు నాయుడు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..” రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకున్నాం. బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో రూ.1,877 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండ్రస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నంలో రూ.2,300 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. వీటికి రూ.6,177 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. రూ.5,718 కోట్లతో మూడు రైల్వే ప్రాజెక్టులు నేడు ప్రారంభం చేస్తున్నాం. విశాఖ రైల్వేజోన్ కల సాకారమైంది. విశాఖ రైల్వే జోన్కు గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోతే 52 ఎకరాలు ఇచ్చి నగరవాసుల చిరకాల కలైన విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభించాం. రూ. 4,593 కోట్లతో 321 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేశాం. రూ.3,044 కోట్లతో 234 కిలోమీటర్ల పొడవైన ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం చేశాం. ఇది ఏపీ చరిత్రలోనే నిలిచిపోయే రోజు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలే అయ్యింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మెుదటిసారిగా రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చారు. వచ్చిన వెంటనే రూ.2.08,545 కోట్లతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారంటే ఏపీ పట్ల ఆయన నిబద్ధత ఏంటో తెలుస్తోంది. ఇలాంటి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న వ్యక్తి ప్రధాని మోదీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వేళ ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తి మోదీ. 7 మండలాలను రాష్ట్రంలో విలీనం చేసిన వ్యక్తి మోదీ. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నాం. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతాం..,, అన్నారు .
”ఐఐటీ, ఐఐఎం, నిట్, ఎయిమ్స్, ట్రైబల్, సెంట్రల్ వర్సిటీలతోపాటు 12 యూనివర్సిటీలు ఏపీకి కేటాయించారు. కేంద్రం సాయంతో నిలదొక్కుకుని ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. కష్టాలు, సమస్యలను అధిగమించి ముందుకెళ్తాం. కేంద్రం సాయంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకుంటున్నాం. ప్రధాని మోదీ నుంచి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందుతుంటా. అమరావతి నిర్మాణంలో మోదీ సహకారం మరింత కావాలి. అమరావతిని త్వరలో పూర్తి చేస్తాం. మోదీ సారథ్యంలోనే పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేస్తాం. భవిష్యత్లోనూ మా కూటమి కొనసాగుతుంది. ఢిల్లీలో గెలవబోయేది ఎన్డీఏనే. మేమంతా మోదీతోనే ఉంటాం. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజలకు దగ్గరైన వ్యక్తి ఆయన. మా కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది. ప్రధానిగా మోదీ ఉంటారు. ప్రపంచం మెచ్చే నాయకుడు మోదీ. దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ” అని చంద్రబాబు నాయుడు ఉత్సాహంతో ప్రసంగం చేశారు .
విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధానిగా రూపొందిస్తామని, మోడీ దీనికి సహకరిస్తున్నారన్నారు. అంతకు ముందు ప్రధాని మోడీ.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పాలనా భవనాలకు శంఖుస్థాపన్ చేసారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. సభకు భారీగా జనం, టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరయ్యారు.