Preparation: ‘శ్రీవారి లడ్డు ‘ అంత ప్రాశష్యం దేనికి . .?

ఇతరులు అనుకరించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పేటెంట్ తెచ్చుకున్నారు .  అందుకే ఇలాంటి లడ్డును మరెవరు తయారు చేయడానికి లేదు .   

 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని  భక్త కోటి ముక్త కంఠంతో ఎలుగెత్తి పిలిచే తిరుమల కొండ! కలియుగ దైవంగా మనం కొలిచే ఇలవేల్పు  “వేం కటేశ్వరుడు”  ఆ తిరుమలేశుని  దర్శనం అయిన తర్వాత   భక్తిభావంతో స్వీకరించే ప్రసాదమే “తిరుమల లడ్డూ”. ఎన్ని లడ్డూలున్నా శ్రీవారి లడ్డూకున్న ప్రాముఖ్యత, ప్రత్యేకత ,  ప్రచస్యం వేరు . .  ఈ లడ్డూ రుచి, సుచి, సువాసన ఈ  ప్రపంచంలో  ఏ లడ్డూకు ఉండదు.  అంతటిఇతరులు ప్రాముఖ్యత ఉన్న శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు? ఏ ఏ వస్తువులు వినియోగిస్తారో తెలుసుకుందామా . ..ఇతరులు (కాపీ కొట్టడానికి లేకుండా )  అనుకరించడానికి వీలులేకుండా భౌగోళిక ఉత్పత్తి లైసెన్సు(Geographical Patentఉన్న ఏకైక లడ్డూ తిరుమల లడ్డూ. అంటే తిరుమలేశుని లడ్డూతయారీ విధానాన్ని ఎవరూ కాపీ కొట్టకూడదన్నది   దీనర్థం. తిరుమల ఆలయం ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం అప్పట్లో వడకు ఉండేది. అప్పట్లో శ్రీవారికి ‘సంధి నివేదనలు’(నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఆ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. ఆరోజుల్లో స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులకు భోజన సదుపాయాలు లేవు. ఈ ప్రసాదాలు స్వీకరించే భక్తులు తమ ఆకలి తీర్చుకునేవారు.   1940 వరకు ప్రసాదంగా ఉన్న   తీపి బూందీ కాస్త లడ్డూగా రూపాంతరం చెందింది. క్రమేపీ “వడ” స్థానంలో “లడ్డూ” పూర్తి స్థాయి   ప్రసాదమైంది.“లడ్డూ” పేరు వెనుక  సంస్కృతంలో లడ్డుకము, లాడుకము, లట్టీకము అని, తెలుగులో అడ్డుకము, లడ్వము, తమిళంలో ఇలట్టు, లట్టు, లట్టుక అని పిలుస్తారు. 12వ శతాబ్ది “మానసోల్లాస గ్రంథం”లో వీటి ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. హిబ్రూలో LUD అనే పదంను లడ్డూకు సమానార్ధకంగా చెబుతారు. ముద్దగా చేయడాన్నే “లడ్డు”గా పేర్కొన్నారు.

How to Make Tirumala Laddu:

లడ్డూ తయారీశాల-పోటు: తిరుమల తిరుపతి ఆలయంలో మూలమూర్తి కొలువై ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల) కు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా నిర్మించిన చోట పోటు ప్రసాదాలు తయారు చేస్తారు. పూర్తిగా  తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్లి నివేదన చేస్తారు .    తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. లడ్డూ, వడలు మొదలైన ఫలహారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారు చేస్తారు. ఆ ఫలహారాలను కూడా వకుళామాతకు చూపించిన తర్వాతే ఆ స్వామివారికి నైవేద్యంగా అందిస్తారు. 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలైనప్పుడు మనం చూస్తున్న లడ్డూ తయారీ మొదలైంది.

దిట్టం: వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూల తయారీకి వినియోగించే వస్తువులు, సరుకుల మోతాదును “దిట్టం” అంటారు.  తిరుమల తిరుపతి పాలక మండలి 1950లో దిట్టంను పునః  ప్రారంభించారు .    పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం  అనుసరిస్తుంది. దీనినే పడితరం దిట్టం స్కేలుగా కూడా పిలుస్తున్నారు.   మొదట్లో 5100 లడ్డూలు మాత్రమే తయారు చేసే వారు దానికి అనుగుణంగా కావాల్సిన కిలోల్లో దిట్టాన్ని సమకూర్చేవారు. భక్తుల  పెరిగిన తర్వాత అంటే 2001లో ఈ దిట్టంను సవరించారు. 2001 దిట్టం స్కేలు ప్రకారమే లడ్డూలను ఇప్పటికీ తయారు చేస్తున్నారు. 5100 లడ్డూల తయారీకి గాను 803 కేజీల సరుకులు వాడతారు. అంటే 803 కేజీల వివిధ రకాల సరుకులతో 5100 లడ్డూలు తయారు చేస్తారు. ఈ లెక్కన వచ్చే భక్తుల సంఖ్య , డిమాండ్ ఆధారంగా లడ్డులు తయారీ ప్రక్రియ చేపడతారు . ఈ పర్యవేక్షణ కోసం  టీటీడీలో ప్రత్యేక అధికారి (ఇంచార్జ్ )  ఉంటారు .