విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఆదుకుంటామని సీఎం హామీ

విజయవాడ (Vijayawada) లో కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యారు. క్రీస్తురాజపురం (Kristhurajapuram) లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద మరో ఇద్దరు ఉండే అవకాశం ఉందని సహాయ సిబ్బంది (Rescue Team) అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రోక్లెయిన్ (Proklein)సాయంతో కొండ రాళ్లను తొలగిస్తున్నారు.

కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandra Babu) స్పందించారు. మృతురాలు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ (Orders Issued) చేశారు.