APNEWS: ఆరోగ్యశ్రీపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

బీమా విధానంలో NTR వైద్య సేవ(ఆరోగ్య శ్రీ) ను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒక్కో కుటుంబం తరఫున ₹1,700-2,000 ప్రీమియంను బీమా సంస్థలకు చెల్లించాల్సి రావొచ్చని అధికారులు అంచనా వేశారు. దీంతో ప్రభుత్వంపై ఏడాదికి ₹3వేల కోట్ల భారం పడొచ్చని తెలుస్తోంది.  ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పరిమితి ₹25 లక్షలు ఉండగా, బీమా పరిమితి ₹2.50 లక్షలు ఉంటుంది. రోగి వైద్యానికి ఆ మొత్తం దాటితే సర్కారు చెల్లిస్తుంది.