చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కి హైకోర్టు షాక్ ..


మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు , ఆ పార్టీ కీలక నేత , మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో షాక్ తగిలింది. ఫోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.

బాలికపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భాస్కరరెడ్డిపై తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు పెట్టారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ చెవిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

చెవిరెడ్డిపై గత ఏడాది నవంబర్‌లో పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదయింది.. మైనర్‌ బాలికపై అత్యాచారం జరిగిందంటూ అవాస్తవ ఆరోపణలతో ఆయన దుష్ప్రచారం చేశారని బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేసారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రావారిపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.అయితే ఓ బాలిక స్కూల్ నుంచి వచ్చే సమయంలో గాయాలతో పడి ఉండటంతో ఆమెపై అత్యాచారం జరిగిందంటూ అప్పట్లో వైసీపీ నేతలు ప్రచారం చేశారు.

బాలికను పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేస్తున్న సమయంలో చెవిరెడ్డి అక్కడకు చేరుకుని అత్యాచారం జరిగినట్లు ప్రచారం చేశారు.అదేమీ లేదని బాలిక తండ్రి చెప్పినప్పటికీ వినిపించుకోలేదు.

  • ఆ తరువాత తనపై ఎలాంటి అత్యాచారం జరిగలేదని బాలిక పోలీసుల ఎదుట చెప్పింది.
  • అయితే వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.సుదీర్ఘ విచారణ అనంతరం చెవిరెడ్డి పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.
    -ఓ బాలికపై చెవిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అది రుజువు కావడంతో తిరుపతి పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. దీనిపై హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది .