AP Floods: బుడమేరు మళ్ళీ పొంగింది . ..

విజయవాడ.. పరిసర ప్రాంతవాసులకు ఐదు రోజులుగా  కంటిమీద కునుకులేకుండా చేస్తున్న బుడమేరు . . గురువారం ఉదయానికి నెమ్మదించిందనుకున్నారు .  అయితే సాయంత్రానికి బుడమేరు మరోమారు ప్రతాపం చూపుతోంది .

మళ్లీ బుడమేరకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని తెలియడంతో గండ్లను శరవేగంగా పూడ్చటానికి ప్రయత్నిస్తున్నారు. బుడమేరుకు పై నుంచి వరద ఎక్కువగా వస్తుండటంతో గండ్లను పూడ్చలేకపోతున్నారు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రత్రులు   ఎప్పటికప్పుడు బుడమేరు గండ్లు పూడిక పనులను సమీక్షిస్తున్నారు. మరోవైపు బుడమేరు ముంచెత్తడంతో.  నుంచి 7-8 అడుగుల వరద నీటిలో మునిగిన అజిత్‌ సింగ్‌నగర్‌, పాయకాపురం తదితర ప్రాంతాల్లో వరదను తొలగించే పనులు వేగంగా జరుగుతుండటంతో 80 శాతం ముంపు నుంచి కాలనీలు బయటపడ్డాయి.వరద నీరు తగ్గిన ప్రాంతాల్లో అధికారులు ఎక్కడికక్కడ విద్యుత్‌ సరఫరాను వేగంగా పునరుద్ధరిస్తున్నారు. అలాగే వరద ముంపు ప్రాంతాల్లో పారిశుధ్యంపై మంత్రులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు చేస్తున్నారు. అయితే ఇళ్లలో బురద మేట వేయడంతో దాన్ని శుభ్రం చేసుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు ఏకంగా ఫైర్‌ ఇంజన్లను రంగంలోకి దించారు.   వీధుల్లో, ఇళ్లలోకి చేరిన బురద, మురుగును తొలగించే పనులను శరవేగంగా చేపడుతున్నారు.