New District: లడఖ్ లో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు.. కేంద్రం ప్రకటన

కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ (Ladakh) అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Central Home Minister Amit Shah) అన్నారు. లడఖ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఐదు జిల్లాల (Five Districts) ను ప్రకటించిన ఆయన లడఖ్ ను అభివృద్ధి చేసి సంపన్నంగా మార్చాలన్నది ప్రధాని మోదీ నిర్ణయమని తెలిపారు.

కాగా కొత్త జిల్లాల్లో ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ మరియు జన్స్కార్ ఉన్నాయి. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన అనంతరం జమ్ముకశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతం(Union Territory) గా లఢక్ కేంద్ర హోంశాఖ పాలనా నియంత్రణలో ఉంటుంది. కాగా ప్రస్తుతం అక్కడ లేహ్ మరియు కార్గిల్ అనే రెండు జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఏర్పాటు చేసిన ఐదు జిల్లాలతో కలిపి లడఖ్ లో మొత్తం జిల్లాల సంఖ్య ఏడుకు చేరింది.