Puja Khedkar: పూజా ఖేద్కర్ పిటిషన్ పై విచారణ వాయిదా..!!

మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (Pooja Khedkar) కు స్వల్ప ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ (Anticipatory Bail Petition) పై విచారణ జరిపిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

తప్పుడు పత్రాలు (Fake Documents) సమర్పించి యూపీఎస్సీ (UPSC) ఉద్యోగం సంపాదించినట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పూజా ఖేద్కర్ పై ఢిల్లీ పోలీసులు (Delhi Police) క్రిమినల్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం ఆగస్ట్ 21 వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు (Interim orders) ఇచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం గతంలోని మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 29వ తేదీ వరకు పొడిగించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 29 కి వాయిదా వేసింది.