Tirumala : 25 కేజీల బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు..!!

ముంబై (Mumbai)కి చెందిన ఓ కుటుంబం భారీగా బంగారం ధరించి తిరుమల (Tirumala)కు వచ్చారు. సుమారు 25 కేజీల బంగారం (25 Kgs Gold) ధరించిన వారంతా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

వీరిలో ఇద్దరు పది కేజీల చొప్పున, మరొకరు ఐదు కేజీల చొప్పున బంగారం ధరించగా.. దీని విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని అంచనా. కాగా వీరికి పదిహేను మంది సెక్యూరిటీ (Security) గా వచ్చారు. దర్శనం అనంతరం ఆలయం ఎదుట ఇతర భక్తులు వారితో సెల్ఫీలు దిగారు. కాగా గతంలోనూ మహారాష్ట్రకు చెందిన గోల్డ్ మెన్ కుటుంబం( Goldman Family) బంగారం ఆభరణాలు భారీగా ధరించి ఆలయం (Temple) వద్ద సందడి చేసిన సంగతి తెలిసిందే.