పవనే ప్రధాని.. జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు

సెప్టెంబర్ 2వ తేదీ నాడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ వేడుకలో పాల్గొన్న జనసేన నేత, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కీలక వ్యాఖ్యలు చేశారు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) ప్రస్తుతం డిప్యూటీ సీఎం. 2029 లో ఆయన ముఖ్యమంత్రి (Chief Minister) అవుతారు. అదేవిధంగా 2034 సంవత్సరంలో ప్రధానమంత్రి (Prime Minister) అవుతారు. ఇది రాసుకోండి అంటూ జానీ మాస్టర్ వ్యాఖ్యానించారు. దీంతో ఆ కార్యక్రమంలో ఉన్న అభిమానులు (Fans) అంతా ఒక్కసారిగా పీఎం, పీఎం అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. మరోవైపు పవన్ పుట్టినరోజు (Birth Day) సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమా (Gabbar Singh Movie) ను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.