హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఈనెల 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష హాల్లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు.