Telangana Group 1 Mains Hall Tickets: : గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు శుభవార్త

హైదరాబాద్: గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. ఈనెల 14 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ హాల్​ టికెట్లు విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో హాల్​ టికెట్లను అందుబాటులో ఉంచనుంది. ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష హాల్​లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు.