నవరాత్రి సందర్భంగా గుజరాతీల సంప్రదాయ నృత్యమైన ‘గర్బా’పై ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రత్యేకమైన పాటను రాశారు. ఆ పాటను ఈరోజు (సోమవారం) ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు.
”ఈ పవిత్ర నవరాత్రుల్లో దుర్గాదేవిని ప్రజలు ఐక్యంగా, వివిధ రకాలుగా ఆరాధిస్తారు. ఈ ప్రత్యేక సమయంలో అమ్మవారి శక్తి, దయను కీర్తిస్తూ ‘ఆవతీ కాలయ్’ అనే గర్బా పాటను రాశాను. మనందరిపై దుర్గా దేవి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా.’ అని ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
‘ఆవతీ కాలయ్’ పేరుతో ప్రధాని మోదీ రాసిన గర్బా గీతాన్ని గాయని పూర్వా మంత్రి పాడారు. పూర్వా మంత్రి అద్భుతమైన గాయకురాలు అని, చాలా చక్కగా పాడారని ప్రధాని నరేంద్ర మోదీ మరో పోస్టులో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.