modi controversy issue: సీజేఐ ఇంటికి ప్రధాని….చెల రేగిన మోదీ వివాదం..

భారత ప్రధాని నరేంద్ర మోదీ నైతికతను పక్కన పెట్టి న్యాయవ్యవస్థపై సైతం సామాన్యులకు అనుమానం కలిగే రీతిలో వ్యవహరించారు .  దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి .

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నివాసంలో (న్యూ ఢిల్లీ )  జరిగిన గణపతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. దీనిపై మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. సీజేఐ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లడంతో న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమయ్యే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు.

రాజకీయ నాయకుడితో రాజ్యాంగ సంరక్షకుడు సమావేశం కావడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ వ్యాఖ్యలతో సీజేఐ నివాసానికి ప్రదాని మోదీ వెళ్లడం వివాదాస్పదంగా మారింది. శివసేన ఎంపీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. గణపతి పూజా వేడుకల్లో మాత్రమే ప్రధాని మోదీ పాల్గొన్నారని స్పష్టం చేసింది. ఇది మన సంస్కృతిలో భాగమని ఈ సందర్బంగా వివరించింది.

చవితి వేడుకలలో మోడీ . .సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ నివాసంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం టోపీ ధరించి ప్రధాని మోదీ ఈ వేడుకలకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు. ఈ వేడుకలకు విచ్చేసిన ప్రధాని మోదీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు  ఆహ్వానించారు.