అమితాబ్ బచ్చన్ – షారుక్ ఖాన్ సరసన చోటు సంపాదించిన మన చెర్రీ
మెగాస్టార్ చిరంజీవి తనయుడు , టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కి అరుదైన ఘనత దక్కింది. సినీ రంగానికి చరణ్ అందించిన విశేష సేవలకుగానూ సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్లో చెర్రీ మైనపు విగ్రహం (wax Statue) ఏర్పాటు చేయనున్నారు . అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్లో ఈ విషయాన్ని అధికారిక ప్రకటించారు. రూపుదిద్దుకొంటోంది : రామ్ చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు రీసెంట్ గా తీసుకున్నారు . 2025 ఏప్రిల్ , మే నెలల నాటికి చరణ్ మైనపు విగ్రహాన్ని సిద్ధం చేసి, సందర్శన కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు తెలిపారు. మేడమ్ టుస్సాడ్స్లో ఉన్న ఐఐఎఫ్ఏ జోన్లో ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బాద్ షా గా పేరొందిన షారుక్ ఖాన్, కాజోల్, కరణ్ జోహార్ తదితరులు మైనపు విగ్రహాలు కొలువుతీరి ఉన్న సంగతి మనకు తెలిసిందే.
నిర్వాహకులు రామ్ చరణ్ మైనపు విగ్రహం తయారీ కోసం కొలతలు కూడా తీసుకున్నారు . ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ స్టేటస్ సాధించిన రామ్ చరణ్ మైనపు విగ్రహం ప్రపంచ ప్రఖ్యాతి ‘మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం’లో ఏర్పాటు చేయడంపై చెర్రీ అభిమానులు , తెలుగు సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ”సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్లో నాకు స్థానం లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను . చిన్న వయస్సులో ఉన్నప్పుడు దిగ్గజ వ్యక్తుల మైనపు బొమ్మలను అక్కడ చూసి ఆనందించాను . అయితే ఏదో ఒకరోజు అలాంటి వారి మధ్య తనకు కూడా చోటు దక్కుతుందని మాత్రం కలలో కూడా ఊహించలేదు . . సినిమా కోసం తాను పడే తపన, కృషి, అభిరుచికి ఇది గుర్తింపు” -రామ్ చరణ్