”పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడినే మార్చిన పార్టీ. NTR బతికుండగానే పక్కదారులు పట్టి పార్టీని భ్రష్టు పట్టించే పరిస్థితికి తీసుకువెళ్ళినపుడు ఆ మహనీయుడినే తప్పించాం . రూటు మారుతుంటే చంద్రబాబు నైనా మార్చేస్తాం . . అతనో లెక్కా . పార్టీని రక్షించుకోవాలంటే ఏదైనా చేస్తాం . .’ అంటూ టీడీపీ హార్డ్ కోర్ సోషల్ మీడియా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై ఆగ్రహోదగ్రులవుతున్నారు . ముక్యంగా NRI వింగ్ మరీ దాడి ఉదృతం చేస్తున్నారు .
ఫైబర్ నెట్ చైర్మన్ , టీడీపీ అధికార ప్రతినిధి జీవి రెడ్డి వ్యవహారంలో చంద్రబాబును మెజార్టీ నేతలు , కేడర్ తప్పుపడుతున్నారు . చాతకానివాడంటూ దుమ్మెత్తిపోస్తున్నారు . ఐఏఎస్ అధికారులు ఏకమై… ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కి మద్దతుగా నిలబడటంతో .. అతనిపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు సీఎం వెనుకంజ వేశారు . వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కి నిబంధలకు విరుద్దంగా జీతం రూపంలో సొమ్ము చెల్లించారు . దీనిపై ఏపీ సర్కార్ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ జీవి రెడ్డి ఆత్మాభిమానమ్ దెబ్బ తిని . . పార్టీకి , తనకు ఉన్న పదవికి రాజీనామా చేశారు . ఈ వ్యవహారంలో పార్టీ హార్డ్ కొర్ కేడర్ , నైతికంగా పేరున్న నేతలు జీవి రెడ్డికి మద్దతుగా నిలబడ్డారు . ఈ వ్యవహారం టీడీపీలో ముదిరిపాకాన పడుతోంది .