ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో, మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంధికి సిద్దమవుతున్నారా ? దీనిపై ఈ రోజు ఆంధ్రజ్యోతి సంచలన కధనం పబ్లిష్ చేసింది . దీనిపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జోరుగా చర్చ నడుస్తోంది .
గతంలో షర్మిల పార్టీ పెడుతుందని , జగన్ తల్లి వైఎస్ విజయమ్మ జగన్ కి దూరంగా ఉంటుందని , వైసీపీ కి ప్రచారం చేయబోరనికూడా ఆంధ్రజ్యోతి , ABN మీడియా మాత్రమే బ్రేక్ చేసింది . దీంతో ఈ రోజు ఆంధ్రజ్యోతి రాసిన కధనంపై కూడా ఏపీలో రాజకీయ విశ్లేషకులు ఇది నిజమే . . అంటూ విశ్లేషణలు చేస్తున్నారు . జగన్ పెయిడ్ మీడియా మాత్రం ఈ వార్తను ఎప్పటి మాదిరిగా ఖండిస్తూనే ఉంది .
గతంలో ఆంధ్రజ్యోతి రాసినవి జరిగాయని . . దీనిని నమ్మడం కాదు . నిజంగా జగన్ కాంగ్రెస్ లో తన వైసీపీ ని కలపాలంటే షర్మిల అవసరం ఏముంటుంది ? డైరక్టగా జగనే రాహుల్ గాంధీతో మాట్లాడుకోవచ్చు కదా
రాహుల్ ని ఒప్పించలేనన్న అపనమ్మకం జగన్ ని వెంటాడుతోందా ? జగన్ అవినీతిపరుడని … ఆ పార్టీని కాంగ్రెస్ లో కలుపుకుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి ఆ మచ్చ అంటుకుంటుంది రాహుల్ భయపడే ప్రమాదం ఉందా ? షర్మిల అయితే ఏదోలా ఒప్పించగలదని జగన్ నమ్ముతున్నారా ? దీనిపై ఆంధ్రప్రదేస్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది .