organic :ఆర్గానిక్ సాగుచేస్తామని రైతుల ప్రతిజ్ఞ

నేలతల్లి సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించి అందరూ ఆరోగ్యంగా ఉండేలా క్రుషి చేస్తామని రైతులు ప్రతిన బూనారు. ఇష్టదైవం గ్రామ దేవతపై ప్రమాణం చేశారు. ఈ వినూత్న కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓడీసీ మండలం సున్నంపల్లి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామ వికాస జిల్లా వర్గ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య ప్రచారక్ శ్రీరామ్ భారత్ కుమార్, బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ శరత్ కుమార్ రెడ్డి, పలువురు రైతు నాయకులు పాల్గొన్నారు. ఆర్గానిక్ వ్యవసాయం ప్రాముఖ్యత, నేలల సంరక్షణ, పశుపోషణ, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు తదితర వాటిపై రైతులకు అవగాహన కల్పించారు.