Jagan Camp Office Scam :రూ. 3.62 కోట్ల ఎగ్ పఫ్ లు తినేశారట . ..

జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అధికారంలో  క్యాంప్ కార్యాలయం ఎగ్ పఫ్ ల కోసం చేసిన ఖర్చు 3.62 కోట్లట

మైనింగ్ ,  లిక్కర్ ,  ల్యా0డ్స్ కుంభకోణాలే కాదు . . ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ దోచేసుకున్నారు .  అవకాశాలు లేనిచోట్ల కూడా వెతికిమరీ సృష్టించుకుని అందినంతా తినేశారు . . జగన్ ఐదేళ్ల పాలనలో . ..ఆంధ్రప్రదేశ్ ను గుల్ల చేసేసారు .  అక్రమాలకు సంబంచిన ఒక్కో ఆధారం బయటపడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది .  అవినీతి ,  అక్రమాలు ఈ స్థాయిలో కూడా చెయ్యొచ్చా ?  అని నోరెళ్లబెట్టడం సామాన్యుడి వంతవుతుంది .

2019-2014  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో అతని క్యాంప్ కార్యాలయం అధికారులు ,  సిబ్బంది 18,12,835 ఎగ్ పఫ్ లు తిన్నారట .  అంటే రోజుకి . .993 ఎగ్ పఫ్ లు అప్పటి సీఎం క్యాంప్ కార్యాలయం తినేసిందన్న మాట .  ఇందుకోసం సర్కార్ ఖజానాకు మాత్రం 3 కోట్ల ,  62 లక్షల 6 వేళా 700 రూపాయలు బొక్క పెట్టారు .

ఒక్క ఎగ్ పఫ్ లే ఇన్ని తిన్నారంటే . .. వెజ్ పఫ్ లు ,  కేకులు ,  ఇతర స్నాక్స్ ఎన్ని తిన్నారో ,  ఎన్ని కోట్ల బిల్లు పెట్టారో తెలియాల్సిన అవసరం ఉందంటూ సోషల్ మీడియాలో చురకలు వేస్తున్నారు .