జీవి రెడ్డి . ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీ వాయిస్ బలంగా వినిపించిన యువనేత. టీడీపీ అధికారంలో లేని సమయంలో 2021 లో ఆ పార్టీలో చేరి . … అప్పటి అధికార వైసీపీ అరాచకాలపై పద్దతి ప్రకారం ధ్వజమెత్తి , జనంలో జగన్ సర్కార్ అరాచకాలు , అక్రమాలను కడిగేసిన నిఖార్చయిన నేతగా టీడీపీలో పేరుంది . అలాంటి నేతను తెలుగుదేశం అధిష్టానం చేతగాని చేష్టలతో వదులుకోవాల్సి వచ్చింది.
కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా , , పాలనపై ఇంకా పట్టు సాధించని సీఎం చంద్రబాబు . . ఈ వ్యవహారంతో టీడీపీ హార్డ్ కొర్ కేడర్ లో చులకనైపోయినట్లు కనిపిస్తోంది .
జీవి .. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి కూడా రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పదవిని వదిలేసారు . ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు . తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని కూడా స్పష్టం చేసారు . న్యాయవాదిగా తన వృత్తిని కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. ఫైబర్ నెట్ చైర్మన్ గా ఆయన కొద్ది కాలం కిందటే బాధ్యతలు తీసుకున్నారు. అనతికాలంలోనే . . దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నారు.
టీడీపీ కోసమే జీవి రెడ్డి ఫైట్ . .
చంద్రబాబు , పవన్ కుటుంబ సభ్యులను దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కి ఫైబర్ నెట్ లో పోస్టులు ఇచ్చారు . జీవి రెడ్డి చైర్మన్ అయ్యాకా వారందరినీ తొలగించాలని ఎండీ కి ఆదేశించారు . అయితే వైసీపీ హార్డ్ కొర్ గా ఉన్న ఫైబర్ నెట్ ఎండీ దినేష్ . . మాత్రం . . వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కి ఈ నెల కూడా జీతాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసారు . ఈ విషయాన్నీ జీవి రెడ్డి ప్రభుత్వ పెద్దల దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయింది . దీంతో ప్రెస్ మీట్ పెట్టి వెల్లడి చేసారు .
సీఎం చంద్రబాబుకి ఈ వ్యవహారం కోపం తెప్పించింది . జీవిని పిలిపించి క్లాస్ తీసుకున్నారు . అయితే అక్రమాలకు పాల్పడిన ఫైబర్ నెట్ ఎండీని మాత్రం చంద్రబాబు వెనకేసుకొచ్చినట్లు చెపుతున్నారు . ఐఏఎస్ అధికారులు ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు ఈ విధంగా చేసినట్లు ప్రచారం జరుగుతోంది .
చంద్రబాబు ధోరణి ఇంతే . .
వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ ని ఆ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ తో నింపేసి . . టీడీపీ , జనసేన వారిపై బూతులు పెడుతూ నానా యాగీ చేశారు . అలాంటి బ్యాచ్ ని ఇంకా కొనసాగిస్తూ . . సంస్థ ఎండీ ఐఏఎస్ అధికారి దినేష్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి . అయితే దీనిపై ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో పోరాటం చేస్తున్న జీవికి మద్దతు లభిచనకపోగా . . ఛీత్కారం ఎదురయింది . ఇదే ధోరణి టీడీపీలో కొనసాగుతోందని కేడర్ గగ్గోలు పెడుతున్నా . . చంద్రబాబుకి మాత్రం ఈ ఘోష వినిపించడంలేదు .
పార్టీకి తీవ్ర నష్టం . . జీవి రెడ్డి రాజీనామా వ్యవహారం టీ కప్పులో తుఫాన్ .. అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నా , , టీడీపీ కేడర్ కి తప్పుడు సంకేతం వెళ్ళింది .
చంద్రబాబును , పవన్ ని , వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టకుండా , చట్టపరంగా శిక్షలు పడకుండా , , కాపాడుతున్న ఫైబర్ నెట్ ఎండీ , ఇతర అధికారులకు చంద్రబాబు వత్తాసు పలుకుతున్నట్లు పార్టీ కేడర్ కి సంకేతాలు వెళుతున్నాయి .
జీవి రెడ్డిపై టీడీపీ లో కొందరు తమ సోషల్ మీడియా విభాగంతో ”జీవి రెడ్డి వైసీపీ కోవర్ట్ ‘ ‘ అంటూ తప్పుడు పోస్టులు పెట్టించారు . ఇది పార్టీలో మెజార్టీ నేతలు , కేడర్ తిప్పికొట్టారు . దీంతో టీడీపీ లో కొందరు చేసిన నక్కజిత్తులు వ్యవహారం తేలిపోయింది . ఈ వ్యవహారంతో టీడీపీకి పెద్ద దెబ్బ తగిలినట్లయింది . అయినా చంద్రబాబుకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా అనిపించడంలేదు . . అంటూ టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు .