YCP Ex.mp. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్

  ఎట్టకేలకు వైఎస్సార్సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.  మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో సురేష్ ఫై  కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.  అయితే అరెస్ట్ భయంతో సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేశారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూసి పోలీసులు వెనుదిరిగారు. ఈ క్రమంలోనే సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌ నుంచి పారిపోయేందుకు సురేష్‌ ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది. దీంతో హైదరాబాద్‌ వెళ్లిన ప్రత్యేక బలగాలు సురేష్​ను అరెస్ట్ చేసి మంగళగిరి తరలిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులు   12 బృందాలుగా ఏర్పడి ముమ్మర గాలింపు చేస్తున్నారు .