కిమ్ క్రూరత్వం.. వరదలను అడ్డుకోలేదని అధికారులకు మరణశిక్ష..!!

విధి నిర్వహణ (Duty management) లో అలసత్వం ప్రదర్శించారని సుమారు 30 అధికారులకు కిమ్ ప్రభుత్వం (Kim Government) మరణశిక్ష విధించిందని తెలుస్తోంది. ఉత్తరకొరియా (North Korea) లో ఈ ఘటన చోటుచేసుకుందని కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి.

అవినీతి, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో సుమారు 20-30 మంది ప్రభుత్వ అధికారులకు ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జోంగ్ ఉన్ (kim jong un) మరణశిక్ష విధించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.