by Srinivas Vedulla | Apr 14, 2025 | ఆంధ్రప్రదేశ్
34 వేల ఎకరాలు సరిపోదట .. మరో 44,670 ఎకరాలు భూమి సమీకరిస్తారట. వేల రైతు కుటుంబాలతో చంద్రబాబు ‘రిస్క్ గేమ్ ‘ ఆడటం ఎంతవరకు కరెక్ట్ ?
Chandrababu is working to sink Amaravati. If this trend continues, Andhra Pradesh will also sink.
అమరావతిలో గతంలో సేకరించిన భూములనే ఇంకా పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. కనీసం 10 శాతం పనులు కూడా చేపట్టలేదు. 2014-2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు హడావుడి చేసి . .. అభాసుపాలయ్యారు. 2019-2024 మధ్య సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అరాచకాలను తరిమికొట్టాలని కంకణం కట్టుకున్న జనం ప్రత్యామ్నయంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ , బీజేపీ కూటమిని గద్దెనెక్కించారు. కూటమి బలం కంటే . . జగన్ అరాచకాలకు భయపడి కూటమికి ఓట్లేసి గెలిపించిన ఎన్నికగా చరిత్రలో నిలిచిపోయిన ఎన్నిక అది .. ఈ మాత్రం చంద్రబాబు అండ్ కో కు బుర్ర, బుద్ధి లేకుండా ఉన్నాయా ? ”అమరావతిలో అనుకున్న పనులేవీ ఇంకా ఆరంభించనేలేదు . . ఉన్న భూములు సరిపోవని , మరో భారీ భూసేకరణకు సిద్ధం కావడం చూస్తుంటే అమరావతిని చంద్రబాబు ముంచేలా కనిపిస్తున్నాడు.. అమరావతినే కాదు . .చంద్రబాబు పాలన ఇదే ధోరణితో సాగితే ఆంధ్రప్రదేశ్ నే ముంచేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు . …
మెజార్టీ ఆంధ్ర ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ముచేసేలా కనిపిస్తోంది. ”అమరావతిని విశ్వ నగరం’గా తీర్చిదిద్దుతానంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు . … ప్రకటనలంత బలంగా పనులు మాత్రం చేయించుడలేకపోతున్నారు. కూటమి అధికారం చేపట్టి పది నెలలు దాటుతున్నా . .. 2016 లో రాజధాని కోసం భూములు సేకరించిన రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు తయారు చేసి ఇవ్వలేకపోయారు.
అమరావతిలో గతంలో సమీకరించిన భూములకు సైతం చెప్పుకోదగ్గ ధర పలకడంలేదు. కొర్ కేపిటల్ లో మాత్రం కొంతవరకు నడుస్తోంది. (90 శాతం మందికి 2018-2019లో ఇచ్చారు . వాటిని జగన్ సర్కార్ నిర్వాకంతో తుప్పలు మొలిపించి చెల్లాచెదురు చేశారు . . . వాటిని క్లియర్ చేసి రైతులకు ఇవ్వాల్సి ఉంది)
”అమరావతి భూ సమీకరణ వరల్డ్ రికార్డ్. 34 వేల ఎకరాల భూమిని 29,650 మంది రైతుల నుంచి సమీకరించి . . సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా రూపొంచాలని ప్లాన్ చేశారు ” నిజంగా ఇది చారిత్రాత్మకం . అయితే రెండో విడత భూ సమీకరణ అంత ఆషామాషీగా ఉండదు . ..
ఉన్న భూములలోనే మొదలెట్టలేదు . . 44,670 ఎకరాలు ఏంచేస్తారు ?
ఇప్పటికే 34 వేల ఎకరాలు అమరావతి నిర్మాణం కోసం సేకరించారు. ప్రభుత్వ , అటవీశాఖకు చెందిన భూములు మరో 4,500 ఎకరాల వరకు ఉంది . మరో 3,500 ఎకరాలు సేకరించాలని గత0లోనే భావించారు. ఇంతవరకు బాగానే ఉంది. 2016లో భూములు సమీకరణ చేసినా . .. … టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని బిల్డింగ్స్ మాత్రమే నిర్మించగలిగారు. సచివాలయం నిర్మించినా , , దానికి తాత్కాలికం అని పేరు పెట్టడంతో అది కూడా చంద్రబాబు ఖాతాలోకి రాలేదు. 2019 లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి . .. అమరావతిపై కక్ష కట్టారు . మూడు రాజధానులు ప్రతిపాదన తెరపైకి తెచ్చి . . అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.
10 నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి సర్కార్ అమరావతిపై ఫోకస్ పెట్టింది. అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇంతవరకు ఓకే . పనులు కూడా పూర్తి స్థాయిలో మొదలుకాలేదు . గతంలో ఎమ్మెల్యే , ఎంఎల్సీ క్వాటర్స్ నిర్మాణాలు జరిగాయి. మిగిలిన పనులు ఫిబ్రవరి , మార్చి నెలల్లో మొదలుపెట్టారు . ఇంకొన్ని పనులు ప్రధాని మోడీ చేతులమీదుగా పునఃప్రారంభించిన తర్వాత చేపట్టనున్నారు .
పెట్టుబడిదారులు , పారిశ్రామికవేత్తలు చంద్రబాబును నమ్మడంలేదు: 2014-2019 మధ్య అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు వ్యవహారశైలి దేశవ్యాప్తంగా అభాసుపాలయ్యేలా నడిచింది. ఇటీవల తానూ మారానని . . మారిన చంద్రబాబును చూస్తారంటూ పదేపదే ప్రకటలు చేస్తూనే ఉన్నారు. వాస్తవ పరిస్థితులను పట్టించుకోకుండా ప్రజలను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులకు కాలం చెల్లింది … ఇచ్చిన హామీలు సైతం ”తూచ్ ‘ చెప్పే నాయకుడిగా చంద్రబాబుకు పేరుంది. అలాంటి నేత ఇపుడు రెండో దఫా భూ సమీకరణలో భూములు ఇస్తే . . ఆ రైతులకు భరోసా ఏమిటి ? 2029 లో మరోమారు . .. కూటమి సర్కార్ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ ఉందా ? రాకపోతే మా పరిస్థితి ఏమిటి ? మేమిచ్చిన భూములలో అభివృద్ధి జరగకపోతే . . మేము ఏమి చేయాలి ? ఆ గ్యారెంటీ చంద్రబాబు ఇస్తారా ? అంటూ రాజధాని ప్రాంత రైతాంగం ప్రశ్నిస్తున్నారు .
రెండేళ్లలో అభివృద్ధి శరవేగంగా చేసి . . ప్రజలను , రాజధాని ప్రాంత వాసులలో నమ్మకం కలిగించడంతోపాటు , బీజేపీ కేంద్ర పెద్దలతో భరోసా ఇప్పించి . . అపుడు భూ సమీకరణకు సన్నాహాలు చేసుకుంటే మంచిది. చంద్రబాబుపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లిన ఈ తరుణంలో భూ సమీకరణకు రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు .
అమరావతి ప్రాంతంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్, ఇన్నర్ , అవుటర్ రింగ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది.
వెయ్యి ఎకరాలలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలిక భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాజధాని చుట్టుపక్కల మరో 44,670 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని సీఆర్డీఏ ప్రణాళికలు రుపొంచిందించి.
ప్రస్తుత0 ఉన్న భూముల్లో అభివృద్ధి పనులు శరవేగంగా చేసిన తర్వాత , చేస్తున్న తరుణంలో భూ సమీకరణ అంటే జనం హర్షిస్తారు తప్ప . .. ఆలూ – చూలు – -లేకుండా తగనమ్మ . .. అంటే జనం ఛీ కొట్టే పరిస్థితి తలెత్తుతుందని చంద్రబాబు తెలుసుకుంటే అమరావతి భవిష్యత్తుకు మేలు జరుగుతుంది . లేదంటే అమరావతిని చేతులారా చంద్రబాబే ముంచేసే దుస్థితి ఎదురవుతుంది .
రాజధాని కోసం అవసరాల రీత్యా రెండో విడత భూ సమీకరణ చేస్తున్నామని ముందే సర్కార్ ప్రకటిస్తే బాగుండేది . అలా కాకుండా . . ఈనాడులో రైతులే తమ భూములను సమీకరించాలని ప్రభుత్వానికి విన్నవించినట్లు కధనాలు రాయించడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి . చంద్రబాబు సర్కార్ పై నీలినీడలు అలుముకుంటున్నాయి . తర్వాత ఎలాగూ , ,, సిఆర్డిఏ కమిషనర్ భూ సమీకరణపై ప్రకటన చేశారు . ఈ దొంగాట వల్ల రైతులు , ప్రజలలో అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ”అమరావతిని కొండవీటి వాగు , మద్దూరు వాగు ముంచేస్తాయనుకున్నారు . కానీ వాటి ముంపు సమస్య లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఆ వాగులు వల్ల ముంపు ఆపిన చంద్రబాబు నిర్వాకమే అమరావతిని ముంచే పరిస్థితి తలెత్తుతుంది . ..” అని ఓ టీడీపీ ప్రముఖుడు అభిప్రాయపడ్డారు.
రైతుల ప్లాట్స్ అప్పగించాలి . . కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయింది . ఇంకా రైతులకు ఇవ్వాల్సిన రితనబుల్ ప్లాట్స్ అప్పగించలేదు . కనీసం వాటి సరిహద్దులు నిర్ణయించలేదు . ఇలా కాలయాపన చేస్తూ పొతే . . అమరావతి ఇరవై ఏళ్లకు కూడా పూర్తీ కాదు . . ,, – మాగంటి మురళీకృష్ణ . రైతు – తుళ్లూరు .
నవనాగరాలు పూర్తీ చేసి . . తర్వాత విస్తరణకు వెళ్ళాలి . . అమరావతిలో చంద్రబాబు ప్లాన్ చేసిన నవనాగరాల నిర్మాణం పూర్తిచేసిన తర్వాత 44 వేల ఎకరాల విస్తరణకు వెళ్ళాలి . కానీ ఏమీలేకుండానే భూ సమీకరణ అంటూ హంగామా చేయడం చంద్రబాబు విరమించుకోవాలి . – ఎం నాగేంద్ర ప్రసాద్ . – మంగళగిరి
జగన్ మళ్ళీ గెలిస్తే.? ఆంధ్రప్రజల గ్రహపాటు బాగాలేక పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే . .. ఏంటి పరిస్థితి. దీనిపై చంద్రబాబు , ఎలాంటి హామీ ఇస్తారు? మోడీతో హామీ ఇప్పించినా ఇక్కడ రైతులు , ప్రజలు నమ్మే పరిస్థితిలోలేరు. చంద్రబాబు అమరావతితో ఆటలాడకుండా . .. ముందు ఉన్న భూములలో అభివృద్ధి చేసి . . తర్వాత విడతలవారీగా అవసరమైన భూములు సమీకరించుకోవాలి . – జి . సుందరరావు , అమరావతి .
by Srinivas Vedulla | Apr 9, 2025 | ఆంధ్రప్రదేశ్
”లోకేష్ ని డిప్ట్యూటీ సీఎం చేయాలి . .” అంటూ మూడు నెలల క్రితం టీడీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రి , చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కు టీడీపీ పగ్గాలు అప్పగించాలని సరికొత్త పల్లవి అందుకున్నారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్లో మాట్లాడిన వర్మ పార్టీకి లోకేశ్ నాయకత్వం ఎంతో అవసరమని స్పష్టం చేసారు . రాష్ట్ర రాజకీయాలలో యువతకు స్ఫూర్తివంతమైన నేతగా లోకేష్ గుర్తింపు పొందారన్నారు . లోకేశ్ తెలుగుదేశం పార్టీ రథసారథిగా నియమించాలని ఈ సందర్బంగా టీడీపీ అధిష్టానానికి , చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. లోకేశ్ యువగళం పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపారని, అది పార్టీ విజయానికి దోహదం చేసిందని వర్మ అన్నారు.
పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో తప్పుకుని జనసేన అధినేత పవన్ కి టికెట్ ఇచ్చారు . ఇందుకు ప్రతిగా వర్మకు ఎమ్ఎల్సి ఇస్తామని చంద్రబాబు , పవన్ హామీ ఇచ్చారు . అయితే వర్మకు ఘలక్ ఇచ్చారు . అయినా వర్మ పార్టీకి విధేయంగానే ఉన్నారు . ఈ సమయంలో వర్మపై జనసేన నేత నాగబాబు చేసిన కామెంట్స్ పై పిఠాపురం టీడీపీ కేడర్ ఆగ్రహంగా ఉంది . దీనిపై టీడీపీ అధిష్టానం సైతం వర్మను సముదాయించే పని చేయడంలేదు . అయినా వర్మ తన ఆగ్రహాన్ని బయటపెట్టకుండా టీడీపీని వెన్నంటే ఉన్నారు .
కాకినాడ సభలో వర్మ . .. పార్టీ భవిష్యత్తు కోసం 2047 ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లోకేశ్ నాయకత్వానికి కార్యకర్తలు సంపూర్ణ మద్దతు చెపుతున్నారని కూడా చెప్పుకొచ్చారు .
by Srinivas Vedulla | Apr 8, 2025 | ఆంధ్రప్రదేశ్
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా అరకు, పరిసర గురుకుల పాఠశాల విద్యార్థులు అరుదైన ప్రపంచ రికార్డు సాధించారు . ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఒకేసారి 21,850 మంది గిరిజన బాలబాలికలు 108 సూర్య నమస్కార ఆసనాలతో చరిత్ర సృష్టించారు. రాజమండ్రికి చెందిన ప్రముఖ యోగ గురువు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం అల్లూరి జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శన ఈ వరల్డ్ రికార్డ్ కి వేదికయింది . లండన్ నుంచి వచ్చిన ప్రపంచ రికార్డు యూనియన్ మేనేజర్ అలీస్ రేనాడ్ కార్యక్రమాన్ని పరిశీలించి ప్రపంచ రికార్డుగా నమోదు చేశారు. రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ దినేశ్కుమార్కు అందజేశారు. యోగ గురువు పతంజలి శ్రీనివాస్ . .. గిరిజన విద్యార్థులకు దశాబ్ద కాలంగా యోగలో శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాస్ నిస్వార్ధ సేవలకు గాను కలెక్టర్ . . దినేష్ ఎక్కడికి బదిలీ అయినా . . ఆయా ప్రాంతాలలో గిరిజనులకు శ్రీనివాస్ సేవలు వినియోగిస్తున్నారు .
by Srinivas Vedulla | Apr 5, 2025 | ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ లో చోటుచేసుకున్న తప్పులు , అక్రమాలు సరిదిద్దడంలో కూటమి సర్కార్ సక్సెస్ కాలేదు
ఏపీలో రెవిన్యూ ప్రక్షాళన చేస్తారా? రైతుల ఇబ్బందులు పట్టించుకోవడానికి కూటమి పెద్దలకు తీరికలేదా >
సర్వేయర్ల వ్యవస్థను ప్రక్షాళన చేయకుండా.. భూ సమస్యలు పరిష్కరించాలని కూటమి సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు..
గత పాలకులపై విమర్శలు మాని.. పరిష్కారం దిశగా అడుగులు వేయాలి..
గతంలో జరిగిన తప్పిదాలను పదే పదే ఎత్తి చూపుతూ , గత పాలకులపై దుమ్మెత్తిపోస్తూ.. చంద్రబాబు సర్కార్ కాలం వెళ్లబుచ్చుతున్నట్లు కనిపిస్తోంది. ఆ తప్పులను సరిదిద్దుతారన్న నమ్మకంతో గెలిపించిన ప్రజలకు పరిష్కార మార్గాలు చూపడంలో మీన మేషాలు లెక్కించడం ఇంకెన్నాళ్లు… అని ప్రశ్నిస్తున్న ప్రజలకు కూటమి సర్కార్ ఏమి సమాధానం చెపుతుంది. ఎలా సంతృప్తి పరుస్తుంది. సమస్య పరిస్కారంపై ద్రుష్టి సారించాల్సిన సమయం దాటిపోతున్నా,, గత పాలకులపై దుమ్మెత్తి పొసే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడంలో అర్ధంలేదు.
వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన ‘జగనన్న సమగ్ర భూ సర్వే’ లో వందలు, వేలు కాదు.. లక్షల సంఖ్యలో తప్పిదాలు జరిగాయి. సర్వే తప్పుల తడకతో రైతులు మధ్య భూ వివాదాలు ఏర్పడ్డాయి. వాటిని సరిదిద్దెందుకు కూటమి సర్కార్ ఇప్పటికి రెండు దఫాలుగా నిర్వహించిన ‘రెవిన్యూ సదస్సులలోనూ 25 శాతం కూడా పరిష్కారం కాలేదు.
2024 అక్టోబర్, నెలలో 13,325 పంచాయతీలలో నిర్వహించిన గ్రామ సభలలో .. 53,342 ఫిర్యాదులు వచ్చాయి. డిసెంబర్ 2024లో నిర్వహించిన రెవిన్యూ సదస్సులలో.. 62,732 ఫిర్యాదులు నమోదు చేశారు. అంటే రెండు విడతల సభలలో.. మొత్తం.. 1,26,074 ఫిర్యాదులు రైతుల నుంచి ప్రభుత్వానికి వచ్చాయి.
వీటిలో.. సర్వే సమస్యలు, సరిహద్దు వివాదాలు, రైతు భూములను నిషేధిత జాబితాలో చేర్చిన అంశాలే ప్రధానంగా ఉన్నాయ్.
.
కొన్ని చోట్ల అప్పటి అధికార వైసీపీ పెద్దల ఒత్తిడితో ప్రభుత్వ భూములకు రికార్డులు సృష్టించి భూములు కొట్టేసారు. గ్రామాలలో భూములు ఉండి సదరు భూ యజమానులు పట్టణాలు, నగరాలలో ఉండే వారిలో కొందరి భూముల రికార్డులు కూడా మార్చేసి క్రయ, విక్రయాలు చేసిన సంఘటనలపై కూడా వేల సంఖ్యలో ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లో ఉన్నాయి.
సీఎం చంద్రబాబు సీరియస్..
రెవిన్యూ సదస్సులలో సమస్యలు పరిష్కారం కావడంలేదని ఫీడ్ బాక్ వస్తుందని ఇటీవల అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ‘త్వరలో పరిష్కారం అవుతాయి సార్..’ అని రెవిన్యూ స్పెషల్ సెక్రటరీ సిసోడియా సమాధానం చెప్పారు. ‘మనకు ఓపిక ఉంది.. ప్రజలకు, రైతులకు ఓపిక ఉండాలి కదా.. ఎన్ని రోజులు సహిస్తారు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
సీఎం రెవిన్యూ అధికారులపై ఈ విధంగా సీరియస్ అవ్వడం.. ఈ ఆరు నెలల కాలంలో పదుల సంఖ్యలో జరిగింది. అయినా పరిస్థితులలో మార్పు కనిపించడంలేదంటే … ట్రీట్ మెంట్ ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనే దానిపై యంత్రాంగానికి పూర్తి క్లారిటీ వచ్చినట్లు కనిపించడంలేదని రెవిన్యూ శాఖలో కీలక అధికారి ఒకరు అనధికారికంగా చెప్పారు.
తప్పు చేసిన వారు ఎలా సరిచేస్తారు?
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు ‘’జగనన్న సమగ్ర భూ సర్వే ‘ నిర్వహించారు. 45-50 శాతం భూములలో ఈ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు చెపుతున్నారు. ఆ సమయంలో సర్వే అసమగ్రంగా, అడ్డదారులలో సాగినట్లు అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చేవి. అయినా అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు.
సర్వేలో సచివాలయ సర్వేయర్ల పాత్ర కీలకం. వీరిలో కొంతమందికి అవగాహనలేకపోవడ0, మరికొంతమంది సర్వేయర్లు మామూళ్లకు కక్కుర్తిపడి ఒక రైతు భూమి, మరో రైతు పేరుతో నమోదు చేయడం వంటి తప్పిదాలు చేశారు. కొన్ని చోట్ల రైతు జిరాయితీ భూములను సైతం.. నిషేధిత జాబితా (22 A ) లో చేర్చారు. ఆ జాబితా నుంచి తమ భూములను తొలగించాలంటే రెవిన్యూ, సర్వే అధికారులకు మామ్మూళ్లు ఇవ్వాల్సిందే.
వైసీపీ హయాంలో సర్వే నిర్వహించిన వారే.. ఇంకా ఆయా గ్రామాలలో సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్నారు. గతంలో తప్పు చేసిన ఉద్యోగులే.. ఆ తప్పులను సరిచేయాల్సిన దుస్థితి ఎదురయింది. ఇపుడు సరిచేస్తే.. గతంలో తాము చేసిన తప్పులు బయటపడతాయన్న భయంతో సదరు ఉద్యోగులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఉదాహరణలు ఇవిగో..
కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన బి. శివరామ కృష్ణ అనే ఆదర్శ రైతుకి ఒక చోట 2 ఎకరాల భూమి ఉంది. జగనన్న సమగ్ర భూ సర్వేలో .. 20 సెంట్ల భూమి తక్కువ వచ్చినట్లు చూపారు. అయితే రికార్డ్ ప్రకారం 2 ఎకరాలు, కొలత ప్రకారం కూడా 2 ఎకరాలు ఉంది. ‘’ గతంలో తక్కువ చూపిన సర్వేయర్లు, రెవిన్యూ సిబ్బంది.. ఇపుడు సరిచేయడానికి ఇష్టపడటంలేదు.. ఎన్ని దరఖాస్తులు చేసినా పట్టించుకోవడంలేదు. నాకు దీనిపై అవగాహన ఉంది కాబట్టి పట్టువదలకుండా ప్రయత్నం చేస్తున్నాను. సాధిస్తాను. చిన్న రైతులు, అవగాహళనలేని వాళ్ళ సంగతి ఏమిటి? నాకు తెలిసి 50 సెంట్ల భూమి ఉన్న ఓ చిన్న రైతు భూమిలో.. సర్వే తప్పుల వల్ల.. 23 సెంట్ల భూమి తక్కువ చూపుతున్నారు. ఇలాంటివి సరిచేయకపోతే ప్రభుత్వాలు ఎందుకు? పాలన ఎందుకు?’’ అని శివ రామ కృష్ణ ప్రశ్నిస్తున్నారు.
‘’ భూ సమస్యలు, సర్వే తప్పులు సరి చేయడానికి.. ప్రభుత్వం ప్రత్యేకమైన ఆన్ లైన్ విధానం పెట్టాలి. 100 పదాలతో వారికి ఉన్న సమస్యపై యాప్ లో నమోదు చేసుకునే ఛాన్స్ కల్పించాలి. లేదా వాట్సాప్ వంటి ఫ్లాట్ ఫామ్స్ ద్వారా.. ఫిర్యాదులు స్వీకరించి.. పరిష్కారం కోసం అధికారులకు డెడ్ లైన్ విధించాలి. టక్నాలజీ.. టెక్నాలజీ అని చంద్రబాబు ప్రచారం చేసుకోవడమే కాదు.. ఇలాంటి వాటికీ టెక్నాలజీ వాడాలి..’’ అని రైతు శివరాం ప్రసాద్..
‘అభి న్యూస్ “ ప్రతినిధితో తో మాట్లాడుతూ ప్రభుత్వానికి సూచన చేసారు.
‘’ సమగ్ర భూ సర్వేలో 1.80 ఎకరాల భూమిలో 20 సెంట్ల భూమి తక్కువ చూపి.. 1.60 ఎకరాలు మాత్రమే ఉందని సర్వేయర్ రికార్డ్ చేశారు. దీనిపై అధరాలు ఇచ్చినా సరిదిద్దలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం, RTI ద్వారా ప్రశ్నించడం., ఇలా మూడు, నాలుగు నెలలు రెవిన్యూ, సర్వే అధికారులకు ఫిర్యాదులపై, ఫిర్యాదులు చేసిన తర్వాత నా సమస్య పరిష్కారం అయింది..వేలమంది రైతులు ఈ భూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సర్కార్ దీనిపై ద్రుష్టి సారించి.. త్వరగా పరిష్కారం చూపాలి..’’ అని కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన రైతు ఉండవల్లి నాగేంద్ర ‘’అభిన్యూస్ ‘ ప్రతినిధికి తన సమస్య చెప్పారు.
‘’ అధికారం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా,, గత ప్రభుత్వం చేసిన తప్పులను దెప్పుతూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప సరిదిద్దడంలో చంద్రబాబు సర్కార్ విఫలమవుతుంది. సమస్యను పదే పదే ఫోకస్ చేస్తున్న కూటమి నేతలు.. పరిష్కారం దిశగా ప్రయత్ని0చి.. రైతుల సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి.. గత పాలకులు తప్పులు చేశారనే వారిని సాగనంపి మిమ్మల్ని గద్దె నెక్కించారు. మీరూ అలాగే చేస్తే.. వారి పరిస్థితే మీకూ ఎదురవుతుంది.. ‘’ అని నెల్లూరు జిల్లా కావలి కి చెందిన రైతు నాయకుడు పి. ఎస్ కె కన్నారావు ‘ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు.
రాష్ట్రంలోని మొత్తం 16 వేల గ్రామాలకు గాను వైఎస్సార్సీపీ ప్రభుత్వం భూ సమగ్ర సర్వే కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టి దాదాపు 7 వేల గ్రామాల్లో హడావుడిగా పూర్తి చేసింది. అయితే క్షేత్ర స్థాయి అధికారులు రైతులు, భూ యజమానులు ఫిర్యాదులతో తమ వద్దకు వెళ్లినా సీరియస్గా పట్టించుకోవడం లేదు. అనేక గ్రామాల రైతులు తమ భూమి సరిహద్దులు మార్చారని లేదా అసలు పత్రాల్లో పేర్కొన్న భూమి విస్తీర్ణం మార్చారని ఫిర్యాదులు చేస్తున్నారు.
భూమి రిజిస్టర్లలో తప్పుగా నమోదు చేయడం చాలా చోట్ల సమస్యలను సృష్టించింది. కొన్ని సందర్భాల్లో మరణించిన వ్యక్తుల పేర్లను కూడా చేర్చారు.
టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మరిన్ని చిక్కులు తలెత్తకుండా భూ సర్వే కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని భావించింది. అయినప్పటికీ, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రన్సైటన్ ప్రోగ్రామ్ (డిఐఎల్ఆర్ఎంపి)లో భాగంగా ఉన్నందున ఈ కార్యక్రమాన్ని అదనపు జాగ్రత్తల తో కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. “భూ యజమానుల హక్కుల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకుండానే గత పాలనలో దాదాపు 21 లక్షల భూ రికార్డులు పంపిణీ చేయబడ్డాయి. ‘’దాదాపు 25-30% రికార్డులలో తప్పు నమోదులు జరిగాయని మేము అంచనా వేస్తున్నాము” అని సీనియర్ రెవిన్యూ అధికారి ఒకరు ‘అభి న్యూస్ ‘ కు తెలిపారు.
కొందరు సర్వేయర్లు ఎటువంటి సర్వే చేయకుండా నోటిస్,హాజరు,అంగీకార పత్రాలు పై సంతకాలు తీసుకొంటున్నారని .. ఇలా రైతు సమస్య పరిష్కారం కాకుండా అంగీకార పత్రంపై సంతకం చేస్తే.. ఆ సమస్య పరిష్కరించినట్లు నమోదవుతుందని.. ఇలా చేయవద్దని రైతు నాగేంద్ర .. తోటి రైతులకు సూచిస్తున్నారు.
– కొందరు సర్వేయలు కొన్ని చోట్ల డాక్యుమెంట్స్,భూమి ఉన్న సరే , గవర్నమెంట్ రికార్డ్స్ లో వాటిని మాయం చేసి ఎటువంటి LPM NO ఇవ్వకుండా పక్క రైతులతో ఏదో విదముగా కలిసి వాటిని వారి డాక్యుమెంట్ లో చూపి0చారు.
– ఒక పూరా సర్వే లో ఒకరికి తక్కువ , ఎక్కువ ఉంటే సర్వేయర్లు ఎక్కువ ఉన్న వారి వద్ద నుండి సమ్మతి లెటర్ తెచ్చుకోండి అంటున్నారు. —- ఇది చాలా తప్పు. తక్కువ ఎక్కువ లు సరి చేయాలిసిన బాద్యత వారిదే.
- ఇక సర్వేయర్లు , అధికార్లు వైపు నుంచి ఆలోచిస్తే.. వారికి ప్రభుత్వం నుండి ఒత్తిడి ఉంది, తొందరగా పూర్తి చేయాలి అని, అందువల్ల ఆ ఒత్తిడితో హడావుడిగా పనిచేయాల్స వస్తుంది.
- రాష్ట్రమంతా ఒకేసారి సర్వే పూర్తి చేయాలంటే అయ్యే పనికాదు. అంచలంచెలుగా ఇది చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
by Srinivas Vedulla | Apr 4, 2025 | ఆంధ్రప్రదేశ్
గణనీయంగా తగ్గిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం .. సర్వే నెంబర్లు , వెబ్ ల్యా0డ్ తప్పుల సవరణపై యంత్రాంగం నిర్లక్ష్యం
కూటమి అధికారంలోకి వస్తే ‘రియల్ ఎస్టేట్ ‘ దూసుకుపోతుంది… అంటూ వేసుకున్న అంచనాలు ఆంధ్రప్రదేశ్ లో రివర్స్ అవుతున్నాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి సర్కార్ గద్దెనెక్కి పదినెలలవుతున్నా రాష్ట్రంలో మాత్రం ‘రియల్ ఎస్టేట్ ‘ రంగం గాడినపడలేదు. అమరావతి , కృష్ణా , గుంటూరు జిల్లాలలో మాత్రం ఓ మోస్తరుగా భూములు క్రయవిక్రయాలలో కదలిక కనిపిస్తున్నా , , మిగిలిన ప్రాంతాలలో మాత్రం గతేడాదితో పోల్చినా వెనుకబాటు కనిపిస్తోంది.
గత ఏడాది . (2023-2024).. 22 లక్షల 25 వేల డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయి . 9,600 కోట్ల ఆదాయం వచ్చింది .
గడిచిన ఏడాది 2024-2025 ఆర్ధిక సంవత్సరం 20 లక్షల 20 వేలు మాత్రమే అయ్యాయి . 8,800 కోట్లు మాత్రమే వచ్చింది .
800 కోట్ల ఆదాయం తగ్గింది.
అయితే కూటమి నేతలు మాత్రం.. అభివృద్ధిలో దూసుకుపోతున్నాం . . అంటూ ఆర్బాటంగా ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నారు. అభివృద్ధికి కొలమానంగా చెప్పుకునే రియల్ ఎస్టేట్ రంగంలోనే ఇంత వెనుకబాటు ఉంటే మిగిలిన రంగాల పరిస్థితి కూడా పరిశీలించుకుని సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి.
రియాల్టీ పతనానికి కారణం ?
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏపీలో రియల్ ఎస్టేట్ కుదేలయింది . ఇక్కడి పెట్టుబడిదారులు చాలామంది హైదరాబాద్ వెళ్లి అక్కడ భూములు , భవనాలు కొనుగోలు చేశారు. 2022-2023 నాటికి హైదరాబాద్ లో భూముల ధరలు కృత్రిమంగా పెంచేశారు. ఇంకా పెరిగిపోతాయన్న భ్రమల్లో ఉన్న ఆంధ్రులు ఎగబడి … ఆంధ్రాలో ఉన్న సొమ్ములు తీసుకువెళ్లి తెలంగాణాలో పెట్టుబడులు పెట్టారు .
- తర్వాత హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పతనమైంది . అక్కడి పెట్టుబడులు లాక్ అయ్యాయి .
- జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నపుడు ‘జగనన్న సమగ్ర భూ సర్వే ‘ పేరుతొ జరిగిన అక్రమాలు , తప్పులు లక్షలలో చేరిపోయాయి . వాటిని సరిదిద్దే యంత్రాంగం ఏపీలో లేదు . కూటమి సర్కార్ సైతం అప్పటి తప్పులను సరిదిద్దే ప్రయత్నం సంపూర్నంగ చేయడంలేదు .
- ఈ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ లో భూముల లావాదేవీలు పెరగడంలేదు . ఏపీలో రియల్ పతనానికి ఇదో ప్రధాన కారణంగా చెప్పవచ్చు .
- ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించి0దో లేదో తెలియదు .