భగవద్గీతకు యునెస్కో గుర్తింపు

Srinivas Vedulla

April 18, 2025

యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు- భరతముని రచించిన నాట్యశాస్త్రానికి గుర్తింపు

 హిందువుల ఆరాధ్య గ్రంథం … ఆధునిక వ్యక్తిత్వ వికాస గ్రందంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీతతోపాటు భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చోటు దక్కింది. అత్యుత్తమ విలువ కలిగిన డాక్యుమెంటరీని సంరక్షించేందుకు ఇది దోహదం చేస్తుంది. ఈనెల 17న కొత్తగా 74 డాక్యుమెంటరీలు యునెస్కో మెమోరీ ఆఫ్‌ వరల్డ్‌ రిజిస్టర్‌లో చేరాయి. ఫలితంగా మొత్తం సంఖ్య 570కి చేరింది.


ప్రధాని నరేంద్రమోదీ భగవత్ గీత కు యునెస్కో గుర్తింపు రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమన్నారు. యునెస్కో మెమోరీ ఆ ఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రానికి చోటు దక్కటం కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి లభించిన గుర్తింపు అని ప్రధాని పేర్కొన్నారు.

You May Also Like…